సహజీవనం చేశాడు... సజీవ దహనం చేశాడు | woman and child dies in fire accident | Sakshi
Sakshi News home page

సహజీవనం చేశాడు... సజీవ దహనం చేశాడు

Mar 13 2015 8:38 AM | Updated on Apr 3 2019 8:07 PM

సహజీవనం చేశాడు... సజీవ దహనం చేశాడు - Sakshi

సహజీవనం చేశాడు... సజీవ దహనం చేశాడు

ఇల్లు దగ్ధమై ఇద్దరు సజీవ దహనమైన సంఘటన గురువారం అర్థరాత్రి గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో చోటు చేసుకుంది.

తెనాలి: అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధమై ఇద్దరు సజీవ దహనమైన సంఘటన గురువారం అర్థరాత్రి గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గండికోట మణికంఠ అనే వ్యక్తి స్థానికంగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. గురువారం రాత్రి ఒక్కసారిగా ఇంటి నుంచి మంటలు చెలరేగాయి. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం పోలీసులు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా చిన్నారి, మహిళ మృతదేహాలను గుర్తించారు. మణికంఠే వారిద్దరినీ హత్య చేసి ఇంటికి నిప్పంటించి పరారై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. డీఎస్పీ, సీఐలు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement