తిరుమలకు బస్సులు నిలిపివేస్తాం | will stop buses to tirumala as well, say rtc union leaders | Sakshi
Sakshi News home page

తిరుమలకు బస్సులు నిలిపివేస్తాం

May 8 2015 6:36 PM | Updated on Oct 20 2018 5:55 PM

తిరుమలకు బస్సులు నిలిపివేస్తాం - Sakshi

తిరుమలకు బస్సులు నిలిపివేస్తాం

ఆర్టీసీ కార్మికులకు.. యాజమాన్యానికి మధ్య చర్చలు విఫలం కావడానికి ఆర్టీసీ ఎండీ సాంబశివరావే కారణమని ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు పద్మాకర్ మండిపడ్డారు.

ఆర్టీసీ కార్మికులకు.. యాజమాన్యానికి మధ్య చర్చలు విఫలం కావడానికి ఆర్టీసీ ఎండీ సాంబశివరావే కారణమని ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు పద్మాకర్ మండిపడ్డారు. ఇక నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, త్వరలోనే తిరుమలకు బస్సులు నిలిపివేస్తామని హెచ్చరించారు. తమను చర్చలకు పిలిపించి మరీ అవమానించారని టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి చెప్పారు.

ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మిక సంఘాల నాయకులకు మధ్య జరిగిన చర్చలలో తీవ్ర వాగ్వాదం జరిగింది. యూనియన్ నాయకులు, అధికారులు దాదాపు అరుచుకున్నంత పని చేశారు. ఇక మీదట చర్చలకు వచ్చే ప్రసక్తి లేదని కార్మికులు స్పష్టం చేయగా, మిమ్మల్ని చర్చలకు పిలిచేది కూడా లేదని యాజమాన్య ప్రతినిధులు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement