హైదరాబాద్లో సమైక్యాంధ్ర సభను నిర్వహించి తీరుతామని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ తెలిపారు.
హైదరాబాద్లో సమైక్యాంధ్ర సభను నిర్వహించి తీరుతామని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో ప్రభుత్వం తరఫున ఓ కమిటీని నియమిస్తున్నట్లు యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి స్పందించారు.
ప్రభుత్వ కమిటీ ఏర్పాటును తాము ఆహ్వానిస్తున్నామని, అయితే విధివిధానాలు తెలిసిన తర్వాతే స్పందిస్తామని ఆయన చెప్పారు. సమైక్యంధ్ర కోసం ఉధృతంగా జరుగుతున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని, తామంతా కూడా సమైక్యాంధ్ర కోసమే కృషి చేస్తున్నామని అన్నారు.