జిల్లాలో ఓటర్లు 22 లక్షల మంది | Voters, 22 lakh peoples in the district | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఓటర్లు 22 లక్షల మంది

Mar 21 2014 5:02 AM | Updated on Sep 2 2017 4:57 AM

జిల్లాలో 22 లక్షల మంది ఓటర్లు ఉన్నారని జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకరరావు తెలిపారు.

మండలాలవారిగా జాబితా విడుదల
 మహిళలే ఎక్కువ

 చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో 22 లక్షల మంది ఓటర్లు ఉన్నారని జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకరరావు తెలిపారు.గురువారం ఆయన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల జాబితాను మండలాలవారిగా విడుదల చేశారు.

ఇందులో మొత్తం ఓటర్లు 22,02,621 మంది ఉన్నారు. వీరిలో 11,12,767 మంది మహిళా ఓటర్లు, 10,89,840 మంది పురుషులు ఉన్నారు. 14 మంది హిజ్రాలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement