విశాఖలో భారీగా గంజాయి పట్టివేత | Vigilance Officers Seized Marijuana In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో భారీగా గంజాయి పట్టివేత

Aug 28 2019 1:15 PM | Updated on Aug 28 2019 1:23 PM

Vigilance Officers Seized Marijuana In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: నగరంలో భారీగా గంజాయిపట్టుబడింది. డీఆర్‌ఐ ఇంటెలిజెన్స్‌ అధికారులు వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై- శ్రీకాకుళం జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్‌ని డీఆర్‌ఐ ఇంటెలిజన్స్‌ అధికారులు తనిఖీ చేయగా.. రూ.1.52 కోట్ల విలువ చేసే గంజాయి బయటపడింది. డ్రైవర్‌ కాబిన్‌లో పెట్టి గంజాయిను తరలిస్తున్నారని అధికారులు తెలిపారు. వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.


Advertisement
 
Advertisement
Advertisement