మచిలీపట్నం : బొమ్మరిల్లు ఫామ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్ అక్రమాలపై ఆ సంస్థ ఏజెంట్లు, ఉద్యోగులు, డిపాజిటర్లు ఆందోళన బాటపట్టారు. పైసాపైసా కూడబెట్టుకున్న డబ్బు దోచుకున్నారని డిపాజిటర్లు, సంస్థ చేసిన మోసానికి తాము బలవుతున్నామని ఏజెంట్లు, ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని బొమ్మరిల్లు ఫామ్స్ అండ్ విల్లాస్ సంస్థ ఉద్యోగులు, డిపాజిట్దారులు సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. సంస్థ ప్రతినిధులు వెంటనే వచ్చి డిపాజిట్ సొమ్మును తిరిగి ఇవ్వాలని, లేదా ఇళ్ల స్థలాలు చూపించాలని నినాదాలు చేశారు. అనంతరం బొమ్మరిల్లు సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలిన కోరుతూ ప్రజావాణిలో జేసీ జె.మురళీకి వినతిపత్రం అందజేశారు.
ఇదీ అసలు కథ..
రెండు సంవత్సరాల మూడు నెలల క్రితం మచిలీపట్నంలోని ఈడేపల్లిలో బొమ్మరిల్లు ఫామ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సంస్థను హైదరాబాదులో రిజిస్ట్రేషన్ చేశారు. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నడిపారు. రోజువారీ వసూళ్లు చేయాలని కొంతమంది ఏజెంట్లను నియమించారు. ఈ మేరకు పలు విధాలుగా డిపాజిట్ల సేకరించారు.
గూడూరు మండలం పర్ణశాలలో 32 ఎకరాలను కొనుగోలు చేసి ఎనిమిది కోట్ల వ్యయంతో శ్రీరామరాజ్యం వెంచర్ను, బందరు మండలం గోకవరంలో 11 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఒయాసిస్ సిటీ వెంచర్లను ప్రారంభించారు. ఈ భూములు బొమ్మరిల్లు ఫామ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్కు రిజిస్ట్రేషన్ చేసినట్లు అందరినీ నమ్మించారు. ఇళ్ల స్థలాలు విక్రయించాలని డిపాజిటర్లు, కార్యాలయ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో ఇళ్ల స్థలాలు, డిపాజిట్లు, రోజువారీ వసూళ్ల ద్వారా మచిలీపట్నం కార్యాలయం నుంచి రూ.2.60 కోట్లను జమ చేశారు. డిపాజిట్ల గడువు ముగిసినా నగదు చెల్లించకుండా మొహం చాటేశారు.
ఎనిమిది నెలలుగా పత్తాలేరు
గత ఎనిమిది నెలలుగా బొమ్మరిల్లు సంస్థ యజమాని రాయల రాజారావు తప్పించుకు తిరుగుతున్నాడని కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించిన ఆ సంస్థ ఏజెంట్లు, కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. గూడూరు మండలం పర్ణశాలలో ఏర్పాటుచేసిన శ్రీరామరాజ్యం వెంచర్లోని స్థలాలను విక్రయించి డిపాజిటర్లకు నగదు చెల్లిస్తామని చెబుతున్నారని, కానీ ఒక్కరికి కూడా డబ్బు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. డిపాజిటర్లు తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, వారికి సమాధానం చెప్పుకోలేకపోతున్నామని ఏజెంట్లు వాపోయారు. నవీన్మిట్టల్ కాలనీకి చెందిన లీలానాగమణి అనే ఏజెంట్పై డిపాజిటర్లు తీవ్రంగా ఒత్తిడి తేవటంతో వారితో వాగ్వాదానికి దిగిన ఆమె గొంతు మూగబోయిందని సహచరులు తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం
బొమ్మరిల్లు ఫామ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్ సంస్థపై తాము ఫిబ్రవరిలో చిలకలపూడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏజెంట్లు తెలిపారు. బొమ్మరిల్లు సంస్థ నుంచి డిపాజిటర్లకు సొమ్ము చెల్లించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జేసీ మురళీకి ఇచ్చిన వినతిపత్రంలో కోరినట్లు చెప్పారు. బొమ్మరిల్లు సంస్థ యజమాని టీడీపీ నేత కావడం వల్లే ఆయన తప్పించుకు తిరుగుతున్నాడని ఏజెంట్లు తెలిపారు. ఎనిమిది నెలలుగా డిపాజిట్ల చెల్లింపుపై మిన్నకుండిపోయిన సంస్థ యజమాని రాజారావు.. కలెక్టరేట్ వద్ద తాము ఆందోళన చేస్తుంటే వెంటనే విరమించాలని ఫోన్ ద్వారా ఒత్తిడి తెస్తున్నారని బాధితులు చెప్పారు.
నిలువునా ముంచారు
Published Tue, Aug 5 2014 2:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
జగనన్న ప్రభుత్వంలోనే బకాయిలు జమ
తొలి ఓటు పడింది
ప్రశాంతంగా ముగిసిన నీట్
పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
విజయీభవ!
చెరకు రైతుల నోట్లో... చంద్రన్న విషం
లైవ్ ద్వారా మోకాలి సర్జరీపై అవగాహన
గజపతనగరం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ఇలా...
జగనన్నను గెలిపిస్తాం..
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement