వెంకన్న దర్శనానికి 14 గంటలు | Venkanna Darshan either 14 hours | Sakshi
Sakshi News home page

వెంకన్న దర్శనానికి 14 గంటలు

Jul 10 2016 8:55 PM | Updated on Sep 4 2017 4:33 AM

వరుస సెలవులతో నాలుగు రోజులుగా తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది.

సాక్షి, తిరుమలః కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుని దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. వరుస సెలవులతో నాలుగు రోజులుగా తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా భక్తులు క్యూల్లో బారులు తీరారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 65,923 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి.

క్యూ వెలుపల రెండు కిలోమీటర్లమేర విస్తరించింది. వీరికి 14 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. కాలినడక భక్తులకు 10 గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. గదులకు డిమాండ్ మరింత పెరిగింది. గదికోసం కనీసం నాలుగు గంటల సమయం క్యూలో నిరీక్షించాల్సి వచ్చింది. కల్యాణకట్ట వద్ద భక్తులు కిక్కిరిసిపోయారు. పెరిగిపోయిన రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు భక్తుల సౌకర్యాలపై దృష్టిపెట్టడంతో క్యూ కొంత వేగంగా కదిలింది. సౌకర్యాలు కొంత మెరుగుపడ్డాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement