వరుస సెలవులతో నాలుగు రోజులుగా తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది.
క్యూ వెలుపల రెండు కిలోమీటర్లమేర విస్తరించింది. వీరికి 14 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. కాలినడక భక్తులకు 10 గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. గదులకు డిమాండ్ మరింత పెరిగింది. గదికోసం కనీసం నాలుగు గంటల సమయం క్యూలో నిరీక్షించాల్సి వచ్చింది. కల్యాణకట్ట వద్ద భక్తులు కిక్కిరిసిపోయారు. పెరిగిపోయిన రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు భక్తుల సౌకర్యాలపై దృష్టిపెట్టడంతో క్యూ కొంత వేగంగా కదిలింది. సౌకర్యాలు కొంత మెరుగుపడ్డాయి.