కొత్తపాలెంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం | unidentified dead body found in Vizag | Sakshi
Sakshi News home page

కొత్తపాలెంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

Jun 28 2015 9:26 AM | Updated on Sep 3 2017 4:32 AM

విశాఖ జిల్లాలోని గోపాలపట్నం మండలం కొత్తపాలెంలో గుర్తు తెలియని వ్యకి మృతదేహం కలకలం సృష్టించింది.

విశాఖపట్నం (గోపాలపట్నం) : విశాఖ జిల్లాలోని గోపాలపట్నం మండలం కొత్తపాలెంలో గుర్తు తెలియని వ్యకి మృతదేహం కలకలం సృష్టించింది. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దాదాపు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement