అటవీ ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్య | unidentified dead body found in forest area | Sakshi
Sakshi News home page

అటవీ ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్య

Mar 28 2015 9:12 AM | Updated on Sep 26 2018 5:59 PM

చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని గుడ్లనాయినిపల్లి అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తిని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని గుడ్లనాయినిపల్లి అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తిని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. వ్యక్తిని హత్య చేసిన అనంతరం గుర్తు పట్టేందుకు ఆనవాళ్లు లేకుండా చేశారు. మృతదేహం తల భాగాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు.
శనివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. దారిన పోయే వాళ్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా... వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గురైన వ్యక్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement