విశాఖపట్నంలో కిడ్నాపైన ఇద్దరు యువతులను గోపాలపట్నం పోలీసులు రక్షించి గురువారం నగరానికి తీసుకువచ్చారు.
విశాఖపట్నం: విశాఖపట్నంలో కిడ్నాపైన ఇద్దరు యువతులను గోపాలపట్నం పోలీసులు రక్షించి గురువారం నగరానికి తీసుకువచ్చారు. వివరాలు.. విశాఖకు చెందిన ఇద్దరు యువతులను గత నెల 31న సింహాద్రి గిరిప్రదర్శనలో నజీబ్నాథ్ అనే యువకుడు కిడ్నాప్ చేసి కేరళ తీసుకెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న గోపాలపట్నం పోలీసులు అప్రమత్తమై కేరళలో యువతులను బుధవారం పట్టుకున్నారు. అక్కడి నుంచి గురువారం వారిని తీసుకు వచ్చారు.