సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి | Two dies after drown in sea | Sakshi
Sakshi News home page

సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి

Nov 19 2017 5:17 PM | Updated on Nov 19 2017 5:17 PM

వేటపాలెం: కార్తీక మాసం ముగిసినందున పోలి పాడ్యమి రోజున సముద్ర స్నానానికి వచ్చి ఇద్దరు మృతిచెందారు. ఈ విషాద సంఘటన ప్రకాశంజిల్లా వేటపాలెం మండలం రామాపురంలో జరిగింది. గుంటూరుజిల్లాకు చెందిన యోగి(32), జ్యోతి(20), మౌలాలి(25), మరో వ్యక్తి ఆదివారం సముద్ర స్నానానం కోసం రామాపురం తీరానికి వచ్చారు. స్నానం కోసం సముద్రంలోకి వెళ్లగా యోగి, జ్యోతి మృతిచెందారు. మౌలాలి గల్లంతయ్యాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement