అరకులో ట్రాఫిక్ జాం..
సాక్షి, విశాఖపట్నం: భూతల స్వర్గంగా పేర్కొనే విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులో ట్రాఫిక్ జాం ఏర్పడింది. వరుస సెలవు దినాలు ఉండడంతో అరకు లోయ అందాలు తిలకించేందుకు సందర్శకులు పోటెత్తారు. వీరి వాహనాలు ఆదివారం అధికం కావడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం కావడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.