ఈనాటి ముఖ్యాంశాలు
ఫ్రాన్స్ నుంచి అత్యాధునిక యుద్ధ విమానం రాఫెల్ ను భారత్ అందుకుంది. మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భౌతికశాస్త్రంలో నోబెల్ విజేతలను మంగళవారం ప్రకటించారు. రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్, పీసీసీ కార్యదర్శి దాసు వెంకట్రావులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. చివరి అంకమైన చక్రస్నాన ఘట్టాన్ని వేదపండితుల మంత్రోశ్చరణ నడుమ కన్నులపండువగా జరిగింది. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిశాయి. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ పాలన సాగిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.