ఈనాటి ముఖ్యాంశాలు

Today Telugu News Oct 10th CM Jagan launches YSR KantiVelugu Scheme - Sakshi

అనంతపురం జూనియర్‌ కాలేజీలో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. 2020 ఏడాదికిగాను హజ్‌ యాత్ర తొలి దరఖాస్తును డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా గురువారం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. ఆర్టీసీ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ) ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భరోసా ఇచ్చారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top