అసెంబ్లీలో గురువారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు.
హైదరాబాద్ : అసెంబ్లీలో గురువారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సభలో చర్చించాలని టీడీపీ , తెలంగాణ బిల్లుపై చర్చ చేపట్టాలని సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కాగా శాసనసభ సమావేశాలు నేటితో నిరవధికంగా వాయిదా పడనున్నట్లు సమాచారం. దీంతో సమావేశాలపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేడు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.