ఈనెల 30 నుంచి జనవరి 2 వరకూ నడకదారి భక్తులకు దివ్య దర్శనం టోకన్లు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
తిరుమల: ఈనెల 30 నుంచి జనవరి 2 వరకూ నడకదారి భక్తులకు దివ్య దర్శనం టోకన్లు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి మూడో తేదీ వరకూ అన్నిఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేయనున్నారు. ఇదిలా ఉండగా తాజాగా శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీల వేలం ద్వారా రూ.49 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, కాలినడకన భక్తులకు 12 గంటలు సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది రూ.50, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత, రూ.100 గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కో సం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 28 కంపార్టుమెంట్లు నిండాయి.