
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో శనివారం సాయంత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
తిరుమలలో శనివారం సాయంత్రం భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం, నడకదారి భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. అయితే ఉచిత, రూ.50,రూ.100, రూ. 500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 28 కంపార్ట్మెంట్లు నిండాయి.
సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం:
గదుల వివరాలు: ఉచిత గదులు - 54 రూ.50 గదులు - 16 ఖాళీ రూ.100 గదులు - ఖాళీగాలేవు
రూ.500 గదులు - ఖాళీగా లేవు
ఆర్జితసేవల టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - 23 ఖాళీగా ఉన్నాయి.
సహస్ర దీపాలంకరణసేవ - 67 ఖాళీగా ఉన్నాయి.
వసంతోత్సవం - 159 ఖాళీగా ఉన్నాయి.