డ్రంకన్ డ్రైవ్ కేసులో ముగ్గురికి రిమాండ్
అనంతపురం సెంట్రల్: తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన ముగ్గురికి రిమాండ్ విధిస్తూ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి కార్తీక్ తీర్పు వెలువరించినట్లు ట్రాఫిక్ డీఎస్పీ రామకృçష్ణయ్య తెలిపారు. ఇటీవల నిర్వహించిన వాహనాల తనిఖీల్లో బోయ నాగేంద్ర, నరసింహులు, శ్రీనివాసులు, రమణారెడ్డి పట్టుబడ్డారన్నారు. వీరిని శనివారం కోర్టు ఎదుట హాజరుపరచగా మెజి స్ట్రేట్ రిమాండ్కు ఆదేశించారన్నారు.