పిడుగుపాటుకు ముగ్గురి మృతి | three people die of lightning in prakasam | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

Oct 3 2014 5:24 PM | Updated on Sep 2 2017 2:20 PM

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

ప్రకాశం జిల్లాలో తీవ్రంగా కురుస్తున్న వర్షాలకు తోడు పిడుగులు కూడా పడటంతో ముగ్గురు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయాల పాలయ్యారు.

ప్రకాశం జిల్లాలో తీవ్రంగా కురుస్తున్న వర్షాలకు తోడు పిడుగులు కూడా పడటంతో ముగ్గురు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఇంకొల్లు మండలం సుబ్బారెడ్డిపాలెంలో పిడుగు పడి ఓ మహిళ మృతిచెందారు. అనంతలక్ష్మి అనే మహిళ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

మరో ఇద్దరు మహిళలకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే, ఎర్రగొండపాలెం మండలం వై.కొత్తపల్లిలో పిడుగుపడి ఒకరు మరణించారు. జె.వంగలూరు మండలం కోడుమూరులో కూడా పిడుగు పాటుకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement