గౌరిబిదనూరు/అనంతపురం క్రైం : అనంతపురం జిల్లాకు చెందిన అంతర్ రాష్ర్ట దొంగల ముఠా కర్ణాటకలో బీభత్సం సృష్టించింది. చోరీ చేసి.. తప్పించుకునే క్రమంలో కాల్పులు జరిపి ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను గాయపరిచింది. పోలీసులు ఎదురు కాల్పులకు దిగి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు... కర్ణాటక రాష్ర్టం గౌరిబిదనూరు తాలూకాలోని గంగసంద్ర గ్రామ శివారులో బలరాం అనే వ్యక్తికి చెందిన ఫాం హౌస్లో బుధవారం రాత్రి దోపిడీ దొంగలు చొరబడ్డారు. యజమాని సమాచారం మేరకు గౌరిబిదనూరు పట్టణ, గ్రామీణ పోలీసులు ఆగమేఘాలపై అక్కడకు చేరుకున్నారు. పోలీసులను గుర్తించిన దొంగలు.. ఫాంహౌస్ యజమాని తుపాకీతో కాల్పులకు దిగడంతో పట్టణ ఎస్ఐ బైరా, కానిస్టేబుళ్లు ఖలీల్, లింగప్ప, చిక్కణ్ణ గాయపడ్డారు. ఆత్మ రక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడి నుంచి తప్పించుకునేందుకు దొంగలు ప్రయత్నించారు. వెంటాడిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నా రు. వీరిలో ఇద్దరిని మధు, రామాంజిగా గుర్తించారు. ఈ ముఠా కీలక నేత దుర్గాప్రసాద్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. దుర్గాప్రసాద్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తెలుస్తోంది.
ఇతను 2013 లో ఇదేరీతిలో అనంతపురం త్రీటౌన్ పోలీసులపై కాల్పులు జరిపారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన హిందూపురంలోని గుడ్డం ప్రాంతానికి చెందిన దుర్గ.. ఇతనితో కలిసి వందలాది చోరీల్లో భాగస్వాముడైన నారాయణస్వామి, వీరి శిష్యుడైన గంగన్న పోలీసు రికార్డుల్లో పేరుమోసిన దొంగ లు. చిన్న చిన్న దొంగతనాలతో ఆరంభమై భారీ చోరీలు చేసే స్థాయికి ఎదిగారు.
దుర్గను ఎన్కౌంటర్ చేసేందుకు ప్లాన్! : కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో దుర్గ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వారు ధ్రువీకరించడం లేదు. దుర్గ పరారీలో ఉన్నాడని చెప్పి, అతడిని ఎన్కౌంటర్ చేయడానికి కర్ణాటక పోలీసులు వ్యూహం రూపొందించినట్లు సమాచారం.
దొంగల బీభత్సం
Published Fri, Jul 18 2014 2:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement