వ్యాపార విస్తరణకు ప్రణాళికలు
మరిన్ని అవుట్లెట్ల ఏర్పాటుకు సన్నాహాలు
అంతర్జాతీయ మార్కెట్లోకి సంస్థ ఉత్పత్తులు
గిరిజనుల అభ్యున్నతికి విశాఖపట్నం కేంద్రంగా 54 ఏళ్ల క్రితం ఏర్పడిన గిరిజనసహకార సంస్థ(జీసీసీ) సహకార రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయమార్కెట్లో తన దైన ముద్ర వేసుకునేందుకు అడుగులేస్తోంది. ఇటీవల బాధ్యతలు చేపట్టిన సంస్థ ఎమ్డీ ఏఎస్పీఎస్ రవిప్రకాష్ జీసీసీ ఉత్పత్తులకు గుర్తింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
విశాఖపట్నం: ఏజెన్సీలో గిరిజనులు సేకరించే ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేస్తోంది. సంస్థకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 15కు పైగా ఉన్న తయారీ, ప్యాకింగ్ యూనిట్లలో వాటిని మార్కెటింగ్కు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. ఏటా రిటైల్ మార్కెటింగ్ ద్వారా రూ.23.55 కోట్ల లావాదేవీలు సాగిస్తున్న సంస్థ రానున్న ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.40 కోట్లు వ్యాపారం చేయాలన్న లక్ష్యంతో ఉంది. ఇందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఏపీలో 25 సొసైటీల ద్వారా 541 షాపులను ఏర్పాటు చేసి గిరిజనులకు నిత్యావసరాలను సరఫరా చేస్తున్నది. అలాగే రాష్ర్ట వ్యాప్తంగా వందకు పైగా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా వెయ్యికి పైగా రిటైల్ అవుట్ లెట్లలో గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించింది.
పుణ్యక్షేత్రాల్లో జీసీసీ అవుట్లెట్స్
జిల్లా కేంద్రాలతో పాటు రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న రైతుబజార్లలో మరో రెండు నెలల్లోనే ప్రత్యేక అవుట్లెట్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. అలాగే రాష్ర్ట వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు, దేవస్థానాల్లో అవుట్లెట్ల ఏర్పాటుకు నిర్ణయించింది. ఈమేరకు అనుమతులకు దేవాదాయశాఖ కమిషనర్కు జీసీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ రవిప్రకాష్ లేఖ రాశారు. కమిషనర్ నుంచి అనుమతులు రాగానే తమ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా అన్ని దేవస్థానాల్లో కౌంటర్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా రానున్న గోదావరి పుష్కరాల్లో రాజమండ్రితో పాటు పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అవుట్లెట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇలా వ్యాపారాన్ని విస్తరించు కునేందుకు సన్నాహాలు చేస్తోంది.
అంతర్జాతీయమార్కెట్లోకి జీసీసీ ఉత్పత్తులు
ఇప్పటికే జిల్లాలో ఆన్లైన్సేల్స్ ప్రారంభించిన జీసీసీ త్వరలో అంతర్జాతీయ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అనుభవం ఉన్న సర్వీస్ ప్రొవైడర్ల అన్వేషణ ప్రారంభించింది. వీరికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని జీసీసీ అందించనుంది. వీరి ద్వారా ఈ కామర్స్లో వ్యాపారం చేసే ప్లిప్కార్ట్, ఎమజాన్, ఈ-బే, స్నాప్డీల్, సాత్విక్షాప్ తదితర ఆన్లైన్ ఏజెన్సీలతో టైఅప్ పెట్టు కుని జీసీసీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయం కల్పించనుంది. సర్వీస్ ప్రొవైడర్ల కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. మరో పదిహేను రోజుల్లో ఇవి ఖరారు అవుతాయి. సర్వీస్ ప్రొవైడర్లు వారు చేసే వ్యాపారాన్ని బట్టి పర్సంటేజ్ ఇవ్వాలని జీసీసీ నిర్ణయించింది. ఈ ప్రయత్నం విజయవంతం అయితే గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయం కల్పించిన కార్పొరేషన్గా ఖ్యాతి గడించనుంది.
వ్యాపార విస్తరణే లక్ష్యం
గిరిజను సేకరించే అటవీ ఉత్పత్తులకు మంచిధరతో కొనుగోలు చేసి వారిని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు..ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే లక్ష్యంగా జీసీసీ కృషి చేస్తున్నది. అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే ఉత్పత్తులన్నీ కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నాం. అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయంతో వ్యాపారాన్ని రెట్టింపు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం.
-ఏఎస్పీఎస్ రవిప్రకాష్, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, జీసీసీ
మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులు
ఇప్పటికే తేనె, చింతపండు, షికాకాయి, కుంకుడుకాయ, ఉసిరి ఫౌడర్స్,రాజ్మా, అలోవిరా, టెర్మరిక్, నీమ్, హనీసోప్స్, డ్రైచిల్లీ ఫౌడర్, సోయాబీన్ ఫౌడర్,సోయా బీన్ మిల్క్ మేకింగ్, కాఫీ ఫౌడర్ వంటి 25రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి జీసీసీ ప్రవేశపెట్టింది. త్వరలో షికా కాయి షాంపు, కుంకుడుకాయ షాంపు, జాస్మిన్ సోప్స్, త్రిపులచూర్ణం, త్రిపుల జ్యూస్ వంటి మరో ఐదు ఉత్పత్తులను త్వరలో మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు జీసీసీ ఏర్పాట్లు చేసింది. వచ్చే నెల నుంచే ఈ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
జీసీసీకి పూర్వవైభవం
Published Thu, Feb 26 2015 12:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement