విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత | Temperature decreases in vizag agency | Sakshi
Sakshi News home page

విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత

Jan 19 2016 8:34 AM | Updated on Sep 3 2017 3:55 PM

ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి.

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు.

ఏజెన్సీలోని  అరుకు, పాడేరులో 10 డిగ్రీలు.... అలాగే మినుములూరులో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది.  విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement