
బద్వేలు: ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని శనివారం ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి వంతెన వద్ద వైఎస్సార్టీఎఫ్ నేతలు కలిశారు. సీపీఎస్ రద్దుకు వైఎస్జగన్ హామీ ఇవ్వడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాలిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిధర్రెడ్డి, గోవిందరెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పుల్లారెడ్డి, కడప జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, వెంకటనాథరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి అమరనాథరెడ్డి, ప్రకాశం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జీవీరెడ్డి ఉన్నారు.