'ఏ అంశంపై డిమాండ్ చేసినా.. చర్చకు సిద్ధం' | tdp ready to discuss anything , says kalva srinivasulu | Sakshi
Sakshi News home page

'ఏ అంశంపై డిమాండ్ చేసినా.. చర్చకు సిద్ధం'

Aug 31 2015 7:40 PM | Updated on Aug 10 2018 8:16 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి మంగళవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి మంగళవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ప్రత్యేక హోదా ఒక్కటే ఏపీకి సరిపోదని టీడీఎల్పీ భావనగా పేర్కొన్న కాల్వ.. మిగతా నాలుగు రోజుల పాటు అసెంబ్లీలో అర్ధవంతమైన చర్చ జరగాలన్నారు.

 

ప్రతిపక్షం ఏ అంశంపై డిమాండ్ చేసినా.. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై సభ్యులకు అవగాహన కల్పిస్తామని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అభివృద్ధి పథఖాలపై అందరూ అవగాహన పెంచుకోవాలని సీఎం ఆదేశించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement