టీడీపీ మహానాడులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
టీడీపీలో ప్రాథమిక సభ్యత్వాలుండవు
May 27 2017 5:52 PM | Updated on Oct 8 2018 5:28 PM
విశాఖపట్టణం: టీడీపీ మహానాడులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ సంస్థాగత నియమావళిలో మార్పులు సూచిస్తూ కనకమేడల రవీంద్రబాబు ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. దీని ప్రకారం ప్రాధమిక, క్రియాశీలక సభ్యత్వాల ప్రక్రియలో మార్పులు చేశారు. ప్రాథమిక సభ్యత్వాల ప్రక్రియను రద్దు చేసి, ఇకపై క్రియాశీలక సభ్యత్వం మాత్రమే చేయాలని తీర్మానించారు. అంతేకాకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్షులను ఎప్పుడైనా మార్చే అధికారం జాతీయ అధ్యక్షుడికి కట్టబెడుతూ ఏకగ్రీవంగా ఆమోదించారు.
Advertisement
Advertisement