షుగర్ ఫ్యాక్టరీ ఎండీపై విచారణ | Sugar Factory Managing Director inquiry | Sakshi
Sakshi News home page

షుగర్ ఫ్యాక్టరీ ఎండీపై విచారణ

Sep 7 2013 5:11 AM | Updated on Mar 21 2019 8:35 PM

కోవూరు చక్కెర కర్మాగారం ఎండీ సుధాకర్‌రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు డెరైక్టర్ ఆఫ్ షుగర్స్ నిర్ణయించింది. ఈ మేరకు 15 రోజుల్లో విచారణ జరిపి నివేదిక పంపాలని శుక్రవారం కలెక్టర్ శ్రీకాంత్‌కు ఆదేశాలు పంపింది.

కోవూరు, న్యూస్‌లైన్: కోవూరు చక్కెర కర్మాగారం ఎండీ సుధాకర్‌రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు డెరైక్టర్ ఆఫ్ షుగర్స్ నిర్ణయించింది. ఈ మేరకు 15 రోజుల్లో విచారణ జరిపి నివేదిక పంపాలని శుక్రవారం కలెక్టర్ శ్రీకాంత్‌కు ఆదేశాలు పంపింది. వెంటనే స్పందించిన ఆయన కర్మాగారంలోని పలు విషయాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపేందుకు కోఆపరేటివ్ ఆఫీసర్లను నియమించారు. సుధాకర్‌రెడ్డి ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.36 కోట్ల లావాదేవీలు జరిగినట్లు, అందులో రూ.6.86కోట్లకు సంబంధించి లెక్కలు లేవని, వాటిని తేల్చాలని డెరైక్టర్ ఆఫ్ షుగర్స్ తన ఆదేశాల్లో  వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోందని ఎంపీ మేకపాటి పేర్కొన్నారు. అన్ని ప్రాం తాల వారికృషితోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పటికీ  కర్ణాట క, మహారాష్ట్రలో డ్యాంలు నిండితేనే దిగువకు నీళ్లు వదులుతున్నార న్నారు. వి భజన జరిగితే శ్రీశైలం, నాగార్జునసాగర్ ఒట్టి పోతాయన్నారు.ఇవన్నీ ఆలోచించకుండా రాష్ట్ర విభజనకు పూనుకోవడం దారుణమన్నారు. తెలుగు ప్రజ లు దీనిని అంగీకరించడం లేదన్నారు.
 
 విభజన కోసం ఇచ్చిన లెటర్‌ను వె నక్కు తీసుకున్న తరువాతనే చంద్రబాబు సీమాంధ్రలో యాత్ర చేయాల న్నారు. బాబు నాటకాలను ప్రజలు  నమ్మరన్నారు. విభజన ప్రకటన తరువా త కొత్తరాజధాని కోసం రూ.5 లక్షల కోట్లు కావాలని బాబు అడగడం వా స్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్‌జీఓలు కలిసి లేఖ వెనక్కు తీసుకోమంటే చంద్రబాబు కుదరదని  చెప్పడం అందరికీ తెలిసిందేనన్నారు. ఇప్పుడు సీ మాంధ్ర కోసం త్యాగాలకు సిద్ధమంటూ  ప్రజలను మోసగించేందుకు బాబు సిద్ధమయ్యాడని విమర్శిం చారు. ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా లేఖ వెనక్కు తీసుకోవాలని డి మాండ్ చేశారు.
 
 సమైక్యాంధ్రకు వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గో పాల్‌రెడ్డి, సమన్వయకర్తలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, డాక్టర్ బాలచెన్నయ్య, సంజీవయ్య, దబ్బల రాజారెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, నెల్లూరు సిటీ క న్వీనర్ ఆనం వెంకటరమణారెడ్డి, మాజీ డీఐజీ బాలకొండయ్య, బండ్లమూడి అనిత, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, స్పందన ప్రసాద్, మల్లికార్జునగౌడ్, సన్నపురెడ్డి వెంకట సుబ్బారెడ్డి, నరసింహారెడ్డి, రూప్‌కుమార్ యాదవ్, చంద్రమౌళి, పాండురంగారెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement