ప్రేమ విఫలమై విద్యార్థిని ఆత్మహత్య

student commits suicide over love failure - Sakshi

పీలేరు: మండలంలోని పచ్చారమాకలపల్లె తండాలో శుక్రవారం రాత్రి ప్రేమ విఫలమై విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ పీవీ సుధాకర్‌రెడ్డి కథనం మేరకు.. జాండ్ల పంచాయతీ పచ్చార్లమాకలపల్లె తండాకు చెందిన హిమబిదు(19) అమ్మానాన్నలు గోపీనాయక్, శాంతమ్మ చనిపోవడంతో అవ్వాతాతలు రేవతి, మహేంద్రనాయక్‌ వద్ద ఉంటోంది. ఆమె ఇంటర్‌ పూర్తి చేసింది. డిగ్రీలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమెకు అదే గ్రామానికి చెందిన చంద్రనాయక్‌ కుమారుడు మణికుమార్‌నాయక్‌తో ఏర్పడిన పరిచ యం ప్రేమగా మారింది.

 వివాహం కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఏమి జరిగిందో కానీ పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతో శుక్రవారం సాయంత్రం హిమబిందు పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె మృతి చెందింది. మణికుమార్‌నాయక్‌ మోసం చేయడంవల్లే తన మనవరాలు ఆత్మహత్య చేసుకుందని మహేంద్రనాయక్‌ వాపోయాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top