
‘శబరిమలై’ రైళ్లు ఫుల్
అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులను ఇక ఆ స్వామే కరుణంచాలి. విజయనగరం మీదుగా వెళ్లే రైళ్లన్నీ వెయి టింగ్ లిస్టుల్లో దర్శనమిస్తున్నాయి. విజయనగరం నుంచి ఎర్నాకులం
విజయనగరం టౌన్: అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులను ఇక ఆ స్వామే కరుణంచాలి. విజయనగరం మీదుగా వెళ్లే రైళ్లన్నీ వెయి టింగ్ లిస్టుల్లో దర్శనమిస్తున్నాయి. విజయనగరం నుంచి ఎర్నాకులం వర కూ రైళ్ల రిజర్వేషన్లన్నీ బుధవారం నుంచి 60 రోజుల వరకూ ఖాళీ లు లేకపోవడంతో యాత్రకు ఎలా వెళ్లాలని అయ్యప్ప భక్తులు ఆందోళన చెందుతున్నారు. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను కూడా వేయకపోవడంతో బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా అవస్థలు పడుతూ ప్రయా ణం సాగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆన్లైన్ వ్యవస్థ ద్వారా హైస్పీడ్ రిజర్వేషన్లు అమలుచేయడంతో ఏ రోజుకారోజు ఉదయం 8 గంటలకే ఆన్లైన్ సెంటర్ల వద్ద చాలా మంది పడిగాపులు కాస్తున్నారు.
మరికొంతమంది తమ ఇళ్ల నుంచే ఆన్లైన్ ద్వారా ముందస్తుగా రిజర్వేషన్లు చేయించుకుంటున్నారు. అయితే ఆన్లైన్పై అవగాహన లేని భక్తులకు టిక్కెట్లు లభించడం లేదు. వీరు విశాఖపట్నం, రాజమండ్రి, విజ యవాడ తదితర ప్రాంతాలలో తమకు అందుబాటులో ఉన్న బంధువుల సహాయంతో రిజర్వేషన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయనగరం మీదుగా ఎర్నాకులం వెళ్లేందుకు కేవలం పది రైళ్లుమాత్రమే ఉన్నాయి. వివేక్ ఎక్స్ప్రెస్(రైలు నంబర్ 15906), డిబ్రూఘర్ - కొచ్చావలి స్పెషల్ (06335), సంత్రాగచ్చి-కొచ్చావలి స్పెషల్(02851), టాటా-అలెప్పీ ఎక్స్ప్రెస్ (18189), ధనబాద్- అలెప్పీ ఎక్స్ప్రెస్ (13351), పాట్నా- ఎర్నాకులం ఎక్స్ప్రెస్(16310), షాలిమార్ -త్రివేండ్రం సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(22642),
గురుదేవ్ ఎక్స్ప్రెస్(12660), గౌహతీ - త్రివేండ్రం ఎక్స్ప్రెస్(12516), గౌహతీ- ఎర్నాకులం ఎక్స్ప్రెస్(12508)లు విజయనగరం మీదుగా ఎర్నాకులం వెళతాయి. ఇందులో ఏ ఒక్క రైలులోనూ బెర్త్లు ఖాళీలు లేకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. ఇంతవరకూ ప్రత్యేక రైళ్లను వేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలకు వేలు ఖర్చుపెట్టి బస్సులను బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిఏటా అయ్యప్ప భక్తులు సంఖ్య పెరుగుతోందని, విజయనగరం మీదుగా ఎర్నాకులం వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసేవిధంగా రైల్వే అధికారులు శ్రద్ధ చూపాలని భక్తులు కోరుతున్నారు.