అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌.. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే | Special trains For sabarimala from telugu states | Sakshi
Sakshi News home page

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌.. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే

Dec 2 2025 10:47 PM | Updated on Dec 2 2025 10:47 PM

Special trains For sabarimala from telugu states

శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల సౌకర్యార్థం  దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. భక్తుల రద్దీ పెరగడంతో తాజాగా మరో 10 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు ఈ రైళ్లు అన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్‌ల మీదుగా శబరిమలకు చేరుకుంటాయి. డిసెంబర్‌ 13 నుంచి 31 వరకు  ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఆ రైళ్లు ఏయే తేదీల్లో ఎక్కడి నుంచి వెళ్తాయో వాటి వివరాలను  దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.   శబరిమలకు ఇప్పటికే  సుమారు 60 ప్రత్యేక సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది.

చర్లపల్లి -కొల్లం జంక్షన్‌ (07119),  సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ -కొల్లం జంక్షన్‌ (రైలు నం. 07117),  చర్లపల్లి -కొల్లం జంక్షన్‌ (07121),   నాందేడ్‌ - కొల్లం (07123) రైళ్లకు డిసెంబర్‌ 3 నుంచే టికెట్ల బుకింగ్‌ ప్రారంభం కానున్నాయి. ఈ నాలుగు రైళ్లకు బుధవారం ఉదయం 8గంటల నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement