టీడీపీ నేత రెస్ట్రూమ్లో పేకాట | Special Squad Police inspectors raid on Toddy compounds | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత రెస్ట్రూమ్లో పేకాట

Jul 29 2015 9:29 AM | Updated on Sep 3 2017 6:20 AM

జూదురుల నుండి స్వాధీనం చేసుకున్న డబ్బుతో  సీఐ ప్రసాదరావు, సిబ్బంది

జూదురుల నుండి స్వాధీనం చేసుకున్న డబ్బుతో సీఐ ప్రసాదరావు, సిబ్బంది

అనంతపురం జిల్లా గుంతకల్లులోని రాణా ప్రతాప్‌గౌడ్‌కు చెందిన కల్లు డిపోపై అనంతపురం స్పెషల్ స్క్వాడ్ పోలీసులు మంగళవారం సాయంత్రం దాడి చేశారు.

9 మంది అరెస్ట్  రూ. 21 లక్షల నగదు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం
- గుంతకల్లు టౌన్: అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ తెలుగుదేశం నాయకుడి రెస్ట్‌రూంలో పెద్ద స్థాయిలో  పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. వారినుంచి రూ. 21.74 లక్షల నగుదు, 11 ఏటీఎం కార్డులు, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గుంతకల్లు అర్బన్ సీఐ ప్రసాదరావు విలేకరులకు తెలిపిన వివరాల మేరకు...  జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని యస్‌యల్‌వి థియేటర్ సమీపంలో టీడీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే సోదరుడు రాణా ప్రతాప్ రెస్ట్‌రూమ్‌పై జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.
 
పేకాట ఆడుతున్న పట్టణానికి చెందిన రాణా ప్రతాప్ అనుచరులు  సూర్యనారాయణ, సత్యనారాయణ, హఫీజ్ ఖాన్‌లతో పాటు రాయచూరు తదితర ప్రాంతాలకు చెందిన వెంకటేశ్వర్లు, ఎండి.ఆరీఫ్, వి.వెంకటే ష్, రాఘవ, ఎం.జయరామ్, కుమార్‌లను అరెస్ట్ చేశారు.  మట్కా, పేకాట ఆడుతూ రూ. 50 వేలతో పట్టుబడే నిందితులను మీడియా ముందుకి చూపే పోలీసు అధికారులు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మొత్తంతో పట్టుబడిన పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులను మీడియా ముందుకు చూపడానికి వెనుకంజ వేశారు. వివరాలు చెప్పాలని పాత్రికేయులంతా గట్టిగా పట్టుబట్టడంతో తప్పని పరిస్థితుల్లో కేవలం స్వాధీనం చేసుకున్న డబ్బును మాత్రమే చూపి చేతులు దులుపుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement