బాని'సెల్‌'

Smart Phone Addict Special Story - Sakshi

ఆరోగ్యం, మానవ సంబంధాలను దెబ్బతీస్తున్న స్మార్ట్‌ ఫోన్‌

ఒంటరి తనానికి అలవాటు పడుతున్న యూజర్లు

అధికమవుతున్న వెన్ను, వినికిడి సమస్యల బాధితులు

అవసరం మేరకే సెల్‌ఫోన్లను వాడాలని సూచిస్తున్న నిపుణులు

సాధారణ ఫోన్‌  వాడుతున్న ఓ గృహిణికితన భర్త స్మార్ట్‌ ఫోన్‌  గిఫ్ట్‌గా ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమె నిద్ర మేల్కొని అందులోనే సీరియళ్లు, సినిమాలు చూస్తోంది. ఆ ప్రభావం ఆమె జీవనశైలిపై పడింది. నిద్ర లేకపోవడంతో పిల్లలను కోపగించుకోవడం.. చిన్న పాటి విషయానికే భర్తతో గొడవ పడటం తరుచూ జరుగుతోంది.

విశాఖపట్నం :ఓ ప్రవేటు సంస్థలో పని చేసే ఉద్యోగి కౌషిక్‌కు చేయి నొప్పిరావడంతో మొదట టాబెట్లు వాడారు. తగ్గక పోగా మెడ, వెన్నునొప్పి కూడా తీవ్రమైంది. వెంటనే ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లిపరీక్షలు చేయించగా రిపోర్టులు అన్నీ నార్మల్‌గానే వచ్చాయి. డాక్టర్‌ అన్ని వివరాలు తెలుసుకుని మొబైల్‌ను అధిక సమయం వినియోగించడంతోనే నొప్పికి కారణమని చెప్పారు. ఆ తర్వాత ఆ ఉద్యోగి వారం రోజుల పాటు మొబైల్‌ను చాలా తక్కువగా ఉపయోగించడంతో నొప్పి తీవ్రత తగ్గింది.నరేంద్ర, పావని ప్రభుత్వ ఉద్యోగులు. వీరి కుమారుడుశ్రీను ఐదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల క్లాస్‌లోబోర్డుపై టీచర్‌ రాసే అక్షరాలు కనిపిచడం లేదనితల్లిదండ్రులకు చెప్పడంతో కంటి వైద్యుడికి చూపించారు. సైట్‌ చాలా ఎక్కువగా ఉన్నట్లు పరీక్షలో తేలింది.తరచూ సెల్‌ ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతుండటంతోనే చూపు తగ్గినట్లు డాక్టర్‌ చెప్పారు.

ముక్కు.. నోరు
శ్వాస మీద ధ్యాసనే ఉండటం లేదు.నోరు.. కుటుంబీకులు, మిత్రులు పక్కనే ఉన్నా స్మార్ట్‌ ఫోన్‌కు బానిసైన వారు నోరు తెరవడమే మానేశారు. అన్నం తినేటప్పుడు కనీసం ఏదీ రుచిగా ఉందా అనే స్పృహ కూడా ఉండటం లేదు.

చెవులు రింగుమని..
వినికిడి సన్నబడి నిరంతరం హెడ్‌ఫోన్లు పెట్టుకొనిపాటలు వినడం,సినిమాలు చూడడంతో వినికిడిసమస్యలు తలెత్తుతాయి. హెడ్‌ ఫోన్లలో శబ్ధతరంగాలునేగరుగా అతి పలుచని కర్ణభేరికి చేరుతుండడంతో వినికిడి సమస్యలువస్తాయి. వినికిడి శక్తి సాధారణంగా60–65 డెసిబుల్స్‌ మధ్య ఉంటేఆరోగ్యం. అయితే హెడ్‌ఫోన్లతో వినికిడి శక్తి 85 డెసిబుల్స్‌కు చేరుతుండడంతో చెముడు వస్తోంది.

వెన్నునొప్పి సమస్యలు
స్మార్ట్‌ఫోన్‌  వినియోగిస్తున్న సమయంలో వెన్నుముకపై ఒత్తిడి పెరుగుతోంది. తల బరువు 4.5 కిలోల నుంచి 5.5 కిలోల బరువు ఉంటుంది. తలను ముందుకు వచ్చి స్మార్ట్‌ఫోన్‌  చూస్తున్న సమయంలో మెడపై భారం పెరుగుతుంది. 30 డిగ్రీల కోణంలో మెడవంచినపుపడు వెన్నుముకపై సుమారు 1.6 కిలోలభార పడుతుందని సర్వే చెప్పింది. దీర్ఘకాలం పాటుఈ స్థాయి భారం పడడం కొనసాగితే వెన్నుపూసలోనడుము నొప్పి సమస్యలు ఎదురయ్యే సమస్యలుఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకురెండు గంటలపాటు స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించేవారికి ఈ ముప్పు అధికంగా ఉంటుంది.

ప్రమాదాలకు మొబెల్‌
స్మార్ట్‌ ఫోన్లతో అప్పుడప్పుడు మృత్యుగంట మోగుతోంది. స్మార్ట్‌ ఫోన్లను చూస్తూ డ్రైవింగ్‌ చేసేవారికారణంగా తరచూ ప్రమాదాలు చోటు
చేసుకుంటున్నాయి. డ్రైవింగ్‌ చేసే సమయంలో సెల్‌ఫోన్‌  మాట్లాడుతూ,సెల్ఫీలు తీసుకుంటూ కొందరుప్రాణాలు కోల్పోతున్నారు.

కళ్లు..
నిద్రలేవగానే మొదట టైం కోసం సెల్‌ అందుకుంటారు. తర్వాతవాట్సప్‌లో గుడ్‌ మా ర్నింగ్‌ అంటూచాటింగ్‌ మొదలై.. ఫేస్‌ బుక్‌లో లైక్‌లు, షేరింగ్‌లు.. గేమ్స్‌.. ఇలా గంటల తరబడి సెల్‌ చూస్తుండటంతో చూపు మందగిస్తోంది.

చెవులు..
స్మార్ట్‌ ఫోన్‌  మాయలో పడిన వారికి పక్కనొళ్లు పిలిస్తే కూడా వినపడం లేదు.

చూపు మందగిస్తోంది
స్మార్ట్‌ఫోన్‌  విడుదలచేసే బ్లూ వయోలెట్‌కాంతి కంటి చూపునకు కీలకమైన రెటీనాపై ప్రభావం పడుతుంది. దీంతో కుంటిచూపు క్రమంగా క్షిణించి కళ్లు ఎరువుఎక్కడం, పొడిబారండం వంటివాటితో కంటిచూపు మందగించేప్రమాదం కూడా ఉందని నేత్రవైద్యులు చెబుతున్నారు.

చర్మం..
3జీ, 4జీ పుణ్యమా అంటూఇంటర్నెట్‌ స్పీడ్‌ ఎంత పెరిగిందో సెల్‌బానిసలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నారు. గంటల తరబడి కదలకుండా సెల్‌ ఫోన్‌  ఉపయోగించడంతో చర్మం మొద్దుబారి అనేక రుగ్మతలకు దారిస్తోంది.

ఇలా.. స్మార్ట్‌ ఫోన్‌  మనిషి ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతోంది. స్లో పాయిజన్‌ గా మారిప్రజల ఆయుష్సు తగ్గిస్తోంది. ఆరోగ్యంతో పాటుమానవ సంబంధాలను దెబ్బతీస్తోంది. జిల్లాలో స్మార్ట్‌ ఫోన్‌  వినియోగదారులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.  వీరిలో గంటల తరబడి వాటిని వినియోగిస్తూ సెల్‌ బానిసలుగా మారిపోయారు.పక్కన ఏమి జరుగుతోందో కూడా చూడడం లేదు.పది మందిలో ఉన్న ఒంటరిగానే ఉంటున్నారు.మొబైల్‌ అతి వినియోగంతో అనార్థలే ఎక్కువని,చివరకు మానవ సంబంధాలపైన కూడా ప్రభా వాన్ని చూపుతున్నాయని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ఇటీవల ప్రకటించడంతో ఆందోళన మొదలైంది.ఎక్కువసేపు ఫోన్లలో మాట్లాడడం, చాటిం గ్‌ చేసేవారిలో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ప్రకటించింది. ఈ తరుణంలోఅవసరం మేరకు మొబైళ్లను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. వినియోగదారుల్లో మార్పు రాకపోతేతీవ్ర పరిణామాలు ఎదర్కోవల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యువత..హల్‌‘సెల్‌’
సెల్‌ ఫోన్‌ తోఎంతటి ఉపయోగాలుఉన్నాయో.. అంత కంటే అనర్థాలు ఎక్కువని ఇటీవల కొన్ని సంఘటనలు చెబుతున్నాయి. స్మార్ట్‌ను అధికంగా వినియోగిస్తున్న వారిలోయువతే ఎక్కువగా ఉంటోంది. దీంతో ఆప్రభావం యువత హల్‌‘సెల్‌’ చేస్తోంది.
నేటి యువకులు నలుగురిలో ఉన్న సమయంలో కూడా సెల్‌కేప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు, బంధువులతో మాట్లా డుతున్నప్పుడే సెల్‌ఫోనే ప్రపంచమవుతోంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ల.. ఇలా సామాజిక మాధ్యమాల్లో వచ్చే విషయాలపై దృష్టి సారిస్తున్నారే కానీ..పక్కన ఏమి జరుగుతుందో పట్టించుకోవడం లేదు.
చదువు, కుటుంబం కంటే అధిక సమయం సెల్‌కే కేటాయిస్తుండటం ఆశ్చర్యం కలిగించే అంశం.
నలుగురితో మాట్లాడేందుకు కూడా ఇష్టపడం లేదు. ఒంటరి జీవితానికి అలవాటుపడుతున్నారు. దీంతో చర్చలు లేకపోవడం విషయ పరిజ్ఞానం తగ్గిపోతోంది.
స్మార్ట్‌ ఫోన్‌ లో అధికంగా అనవసరవిషయాలు, గేమ్స్‌కే అధిక సమయంకేటాయిస్తున్నారు.. బంధువులు ఇంటికొస్తే కూడా వారితో మాట్లడకుండాసెల్‌ ఫోన్‌  చూస్తూ అదే జీవితం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
బాత్‌ రూమ్‌కు వెళ్తూ కూడా మొబైల్‌ను వెంట తీసుకెళ్లేఘనులూ ఉన్నారు.

సెల్‌ఫోన్‌లకు బానిసలవుతున్నాం..
ఉదయం లేస్తే సెల్‌ఫోన్‌..పడుకుంటే సెల్‌ఫోన్‌..నిరంతర జీవితం ఫోన్‌పైనే ఆధారపడుతున్నారు. ముఖ్యంగా యువత సెల్‌ఫోన్‌లకు బానిసలమైపోయాం. దీని కారణంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నా..తగు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాం.  రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు సెల్‌ఫోన్‌లు దూరంగా పెట్టాలని వైద్యులు సూచిస్తున్నా అది సాధ్యం కావడం లేదు. సోషల్‌ మీడియాతోనే తామంతా ఎక్కువగా గడుపుతున్నాం. స్నేహితులకు ఫోన్, మెసేజ్‌లు, పోటీపరీక్షలకు  పరీక్షలో ఉదయం చదువుకోవడానికి అలారం పెట్టుకునేది సెల్‌ఫోన్‌లోనే..అనారోగ్య భారీన పడతామని తెలిసినా వాడక తప్పడం లేదు.  –ఈ. శివకుమార్, డిగ్రీ ఫైనల్‌ఇయర్,కృష్ణా కళాశాల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top