శేషాద్రి, సింహాద్రి, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ల్లో దోపిడీ | Seshadri,simhadri, yesvantpur express passengers robbed | Sakshi
Sakshi News home page

శేషాద్రి, సింహాద్రి, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ల్లో దోపిడీ

May 26 2014 9:19 AM | Updated on Oct 20 2018 6:04 PM

ప్రకాశం జిల్లా వద్ద దోపిడీ దొంగలు పలు రైళ్లలో బీభత్సం సృష్టించారు.

ప్రకాశం: ప్రకాశం జిల్లా వద్ద  దోపిడీ దొంగలు పలు రైళ్లలో  బీభత్సం సృష్టించారు. ఈ రోజు తెల్లవారుజామున శేషాద్రి, సింహాద్రి, యశ్వంత్పూర్, సింహపురి ఎక్స్ప్రెస్లో  దుండగులు దోపిడీకీ పాల్పడ్డారు. సింగరాయకొండ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి అయిదు గంటల సమీపంలో  చోటుచేసుకుంది.

రైల్వే ట్రాక్ మరమ్మతుల సందర్భంగా రైలు  తక్కువ వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు ప్రయాణికుల్ని బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. మరో రెండు రైళ్లలో దోపిడికి విఫలయత్నం చేశారు.  ప్రయాణికుల ఫిర్యాదుతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement