కేసుల తీవ్రత రెడ్‌జోన్లలోనే

Seriousness of the cases is in Redzones - Sakshi

ఒక్క రోజులో నమోదైన కేసుల్లో  72.83% మూడు జిల్లాల్లోనే

కర్నూలు, గుంటూరు,కృష్ణాలో ఎక్కువ కేసులు

ఆదివారం పరీక్షల్లో 5 జిల్లాల్లో సున్నా కేసులు

90 శాతం కేసులు రెడ్‌జోన్లలోనే

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు రెడ్‌జోన్లు కేంద్రంగా కొనసాగుతున్నాయి. కొద్ది రోజులుగా కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే మిగతా జిల్లాల్లోగానీ, కొత్త ప్రాంతాల్లోగానీ వైరస్‌ విస్తరణ లేనందున ఆందోళన అవసరం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఇన్‌ఫెక్షన్‌ రేటు అతి తక్కువగా 1.6 శాతం మాత్రమే ఉండటం ఊరట కలిగిస్తోంది. ఇన్‌ఫెక్షన్లకు సంబంధించి జాతీయ సగటు రేటు 4.23 శాతం ఉంది. కరోనాతో ఛిన్నాభిన్నమైన అమెరికాలో ఇన్‌ఫెక్షన్‌ రేటు భారీగా ఉంది. కేసుల సంఖ్య, మరణాలు భారీగా నమోదయ్యాయి. మరోవైపు దేశంలో పది లక్షల జనాభాకు సగటున వెయ్యి పరీక్షలకుపైగా నిర్వహించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 

6,768 టెస్ట్‌లు, 81 కేసులు
రాష్ట్రంలో గత 24 గంటల్లో 81 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 59 కేసులు మూడు జిల్లాల్లోనే నమోదు కావడం గమనార్హం. ఒక్క రోజులో నమోదైన కేసుల్లో 72.83 శాతం కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే నమోదయ్యాయి. ఒక్క కృష్ణా జిల్లాలోనే 52 కేసులు నమోదయ్యాయి. ఆదివారం 6,768 టెస్టులు చేయగా 81 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. ఇందులో 59 కేసులు కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే నమోదయ్యాయి. అవికూడా ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయని, ఇప్పటికే వాటిని రెడ్‌జోన్‌లుగా ప్రకటించి కంటైన్‌మెంట్‌ చర్యలు చేపడుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 

90 శాతం రెడ్‌జోన్లలోనే..
–కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలో మరిన్ని టెస్టులు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
– ఆశాలు, ఏఎన్‌ఎంలు, వలంటీర్ల అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
–ఇన్ఫెక్షన్‌ ఉన్న వారందరినీ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించనున్నారు. 
–ఆదివారం నమోదైన కేసుల్లో 90 శాతం రెడ్‌జోన్లలోనే నమోదయ్యాయి. 
–చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఆదివారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు
–పశ్చిమ గోదావరిలో 12 కేసులు నమోదయ్యాయి.
– ఇప్పటివరకు 68వేల పైచిలుకు టెస్టులు నిర్వహించగా కర్నూలు, గుంటూరు, కష్ణా జిల్లాల్లో 18,789 నిర్ధారణ పరీక్షలు చేపట్టారు.
–మొత్తం కేసుల్లో ఈ మూడు జిల్లాల్లో నమోదైన పాజిటివ్‌ కేసులు 670 కాగా మిగతా 9 జిల్లాల్లో 427 కేసులు నమోదయ్యాయి.
–రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 4.92 శాతం పాజిటివిటీ రేటు ఉంది
–విజయనగరంలో పాజిటివిటీ రేటు సున్నా కాగా శ్రీకాకుళంలో అత్యల్పంగా 0.08 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. 
–రికవరీ రేటు మరింత పెంచేందుకు క్రిటికల్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌పై దష్టి పెట్టనున్నారు.
–ప్రత్యేక నిపుణుల కమిటీ 24 గంటలూ పనిచేసేలా చర్యలు చేపట్టారు. 

రాష్ట్రంలో మెరుగ్గా పరిస్థితి..
– దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, ఇన్ఫెక్షన్‌ రేటు చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో చాలా తక్కువగా ఉంది. జాతీయ సగటు కంటే ఏపీలో పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు తాజా గణాంకాలు సైతం నిర్ధారిస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో 6.4 శాతం నుంచి 8.6 శాతం వరకు ఇన్‌ఫెక్షన్‌ రేటు ఉన్నట్లు పరీక్షలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీలో అత్యధికంగా 8.64 శాతం ఉంది. ఏపీలో ఇన్‌ఫెక్షన్‌ రేటు 1.6 శాతం మాత్రమే ఉంది. అదే జాతీయ సగటు రేటు 4.23 శాతం ఉంది. పరీక్షలు, పాజిటివ్‌ కేసుల ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. 
– అత్యధిక టెస్టుల నిర్వహణలోనూ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. దేశంలో పది లక్షల జనాభాకు సగటున వెయ్యి టెస్టులు దాటిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 

పాజిటివ్‌ కేసుల శాతం రాష్ట్రంలో చాలా తక్కువ
‘ఇన్ఫెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించాలన్న ఉద్దేశంతో టెస్టులు ఎక్కువగా చేస్తున్నాం. ఆదివారం నమోదైన కేసులు ఎక్కువగా రెడ్‌జోన్‌లోనే కాబట్టి ఆందోళన అవసరం లేదు. పాజిటివ్‌ కేసుల శాతం రాష్ట్రంలో చాలా తక్కువగా ఉంది. వైరస్‌ నియంత్రణకు ముమ్మర చర్యలు కొనసాగుతున్నాయి’
–డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2022
May 08, 2022, 17:43 IST
కెవాడియా(గుజరాత్‌): కోవిడ్‌ మహమ్మారి వల్ల భారత్‌లో 40.7 లక్షల మంది మృతి చెందారని అంచనా వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)...
03-05-2022
May 03, 2022, 03:08 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 12 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 80.82 శాతం...
02-05-2022
May 02, 2022, 03:12 IST
సాక్షి, అమరావతి: కరోనా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే టీకాలు అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని పబ్లిక్‌ హెల్త్‌...
24-04-2022
Apr 24, 2022, 11:03 IST
కన్న తండ్రిని కాపాడుకునేందుకు పడిన వేదన.. ఆస్పత్రి సేవల కోసం చేసిన శోధన.. అంటరాని వాళ్లను చేసి అందరూ దూరం...
21-04-2022
Apr 21, 2022, 11:52 IST
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్‌ విజృంబిస్తోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2380...
20-04-2022
Apr 20, 2022, 13:36 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి....
18-04-2022
Apr 18, 2022, 15:39 IST
వైద్య నిపుణుల ఊహ కంటే ముందే భారత్‌లో ఫోర్త్‌ వేవ్‌ అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పెరుగుతున్న కేసుల్ని...
17-04-2022
Apr 17, 2022, 13:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1150 కొత్త కేసులు నమోదుకాగా.....
16-04-2022
Apr 16, 2022, 13:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో పలు నగరాల్లో కోవిడ్ ఆంక్షలు విధించారు. మరోవైపు భారత్‌లో కూడా...
11-04-2022
Apr 11, 2022, 01:28 IST
అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నవాళ్లలో రక్తం గడ్డకట్టడం, చిక్కబడడం పెరిగి ప్రమాదాలకు దారి...
06-04-2022
Apr 06, 2022, 18:09 IST
ముంబై: రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. వైరస్‌ కట్టడికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రూపం మార్చుకొని...
06-04-2022
Apr 06, 2022, 15:27 IST
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. దీన్ని మనం హెచ్చరికగా తీసుకుని భారత్‌కు ఇక ఏమీ కాదనే...
06-04-2022
Apr 06, 2022, 05:09 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం 16,267 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 30మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో...
27-03-2022
Mar 27, 2022, 21:30 IST
చైనాలో కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నకరోనా కేసులు. పరిస్థితి అంత తేలిగ్గా అదుపులోకి వచ్చే స్థితి ఏ మాత్రం కనబడటం లేదు.
21-03-2022
Mar 21, 2022, 12:59 IST
ఫోర్త్‌ వేవ్‌ రూపంలో కాకున్నా జూన్, జూలై నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు గాంధీ ఆస్పత్రి...
28-02-2022
Feb 28, 2022, 09:43 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ టీకా కోవోవ్యాక్స్‌ను బూస్టర్‌ డోస్‌గా వాడేందుకు వీలుగా మూడో దశ ట్రయల్స్‌కు అనుమతివ్వాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ డీసీజీఐ...
28-02-2022
Feb 28, 2022, 08:26 IST
హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు...
24-02-2022
Feb 24, 2022, 14:35 IST
పూర్తిస్థాయిలో కరోనా ముప్పు తొలగిపోలేదని.. వేవ్‌ రాకున్నా, వేరియంట్లు ఉన్నాయని ప్రొఫెసర్‌ రాజారావు అభిప్రాయపడ్డారు.
19-02-2022
Feb 19, 2022, 07:42 IST
సాక్షి, అమరావతి: ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌ డ్రాప్స్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ శుక్రవారం విశాఖపట్నంలోని విమ్స్‌లో ప్రారంభించినట్టు...
17-02-2022
Feb 17, 2022, 18:38 IST
కోవిడ్‌ వైరస్‌ సోకి కోలుకుని అస్సలు టీకాలు తీసుకోని వారిలో దీర్ఘకాలం పాటు కరోనా సమస్యలు, లక్షణాలు కొనసాగుతున్నట్టు వెల్లడైంది. ...



 

Read also in:
Back to Top