యాచారం, న్యూస్లైన్ : రైతుల నమ్మకాన్ని విత్తన వ్యాపారులు వమ్ము చేశారు. నాణ్యత లేని విత్తనాలు అంటగట్టి నిలువునా ముంచేశారు. కొత్త రకం విత్తనం, పంట దిగుబడి అధికంగా వస్తుందని చెబితే నమ్మి కొనుగోలు చేసిన అన్నదాతలు దారుణంగా మోసపోయారు. విత్తనాలు నారుమడిలో పోస్తే పక్షం రోజులు దాటినా మొలకెత్తక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. వ్యాపారుల మాటల నమ్మి మోసపోయామని రైతన్నలు లబోదిబోమంటున్నారు. మండలంలో మూడేళ్ల తర్వాత సంవృద్ధిగా వర్షాలు కురవడంతో రైతులు అధికంగా వరి సాగు చేయడానికి సిద్ధమయ్యారు. వ్యవసాయాధికారులు అవసరమైన వరి విత్తనాలు అందుబాటులో ఉంచకపోవడంతో అదను పోతుందనే ఆతృతతో రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసుకొని నారుమడులు పోశారు. మండలంలోని మాల్, ఇబ్రహీంపట్నంలతోపాటు మొత్తం 20గ్రామాల రైతులు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని వ్యాపారుల వద్ద వరి విత్తనాలు కొనుగోలు చేశారు. అయితే నారుమడులు పోసినా సగానికి పైగా మొలకలు రాకపోవడంతో మళ్లీ కొత్తవి కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
పదిహేను రోజుల క్రితం తమ్మలోనిగూడ గ్రామానికి చెందిన పలువురు రైతులు నగరంలోని మాదాపూర్లోని దుకాణంలో ఓం సీడ్స్ కంపెనీకి చెందిన వరి విత్తనాలను 25 కిలోల బ్యాగు రూ.720 చొప్పున కొనుగోలు చేశారు. నారుమడులు పోసిన పక్షం రోజుల వరకు కూడ కరిగట్లలో మొలకలెత్తనే లేదు. దీంతో రైతులు విత్తనాల బ్యాగుపై ఉన్న ఫోన్ నంబర్లో సంప్రదిస్తే నాణ్యమైన విత్తనాలనే ఇచ్చాం...మీరే ఎలా నారుమడి పోశారోనని బదులివ్వడంతో విస్తుపోయారు. కేవలం తమ్మలోనిగూడ గ్రామంలోనే కాకుండా చింతపట్ల, మాల్, నల్లవెల్లి, నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, నందివనపర్తి తదితర గ్రామాల్లోనూ చాలామంది రైతులు వరి విత్తనాలను ప్రైవేటులోనే కొనుగోలు చేసి నారుమళ్లు పోశారు. కొన్ని చోట్ల ఆలస్యంగా మొలకెత్తగా, మరి కొందరి పొలాల్లో పదిహేను రోజులు దాటినా కూడా మొలకెత్తలేదు. దీంతో రైతులు మళ్లీ రూ.వందలాది ఖర్చులు చేసి విత్తనాలు తెచ్చి నారుమడులు పోసే పరిస్థితులు వచ్చాయి. ఇంత జరుగుతున్న వ్యవసాయాధికారుల్లో మాత్రం చలనం లేకపోవడం అన్నదాతలకు పెద్ద శాపంగా మారింది.
నాణ్యమైనవని కొంటే...
అందుబాటులో ప్రభుత్వ విత్తనాలు లేకపోవడంతో నగరానికి వెళ్లాల్సి వచ్చింది. వ్యాపారులు వరి విత్తనాలు నాణ్యమైనవని, దిగుబడికి ఢోకా ఉండదని చెప్పడంతో ఓంసీడ్స్ కంపెనీ విత్తనాలు కొనుగోలు చేశాను. నాలుగు సంచులకు రూ.3వేల దాకా ఖర్చు చేశాను. మడి కడితే వారం దాటినా కూడా మొలకలు రాలేదు. రోజూ ఉదయం, సాయంత్రం నీటి తడి అందించినా ఫలితం లేకపోయింది.
- హరికృష్ణ, తమ్మలోనిగూడ
మోసపోయాను..
ఇరవయ్యేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. ఎన్నడూ ఇలా జరగలేదు. అందరూ ఓంసీడ్స్ వరి విత్తనాలు నాణ్యమైనవి అంటుంటే వెళ్లి కొనుగోలు చేశాను. ఈసారి విత్తనాల ఎంపికలో దారుణంగా మోసపోయాను. కరిగట్టు పోసి పక్షం రోజులు దాటినా వరి మొలకెత్తలేదు. విత్తనాల కోసం ఖర్చు చేసిన రూ.2వేలు నష్టపోయాను. అధికారులు స్పందించి నాసిరకం విత్తనాలు అంటగట్టిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి
- భంద్రయ్య, తమ్మలోనిగూడ
చి‘వరి’కి దగా!
Published Mon, Dec 9 2013 12:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement