గుడికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల | Robbery in Ibrahimpatnam | Sakshi
Sakshi News home page

గుడికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల

Sep 4 2015 6:43 PM | Updated on Aug 30 2018 5:27 PM

శ్రావణ శుక్రవారం సందర్భంగా గుడికి వెళ్లొచ్చేసరికి దొంగలు ఇంట్లో విలువైన వస్తువులను కొల్లగొట్టారు.

ఇబ్రహీంపట్నం (కృష్ణాజిల్లా) : శ్రావణ శుక్రవారం సందర్భంగా గుడికి వెళ్లొచ్చేసరికి దొంగలు ఇంట్లో విలువైన వస్తువులను కొల్లగొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం ఉదయం గుడికి వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి వచ్చి చూసేసరికి దొంగలు ఇంట్లోని బీరువాలో ఉంచిన 14 కాసుల బంగారు ఆభరణాలతోపాటు రూ.15వేల నగదును ఎత్తుకుపోయినట్టు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. జాగిలాలలో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement