ఎర్రచందనం గోవిందా | Redwood theft | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం గోవిందా

Aug 11 2015 2:32 AM | Updated on Sep 3 2017 7:10 AM

ఎర్రచందనం గోవిందా

ఎర్రచందనం గోవిందా

తిరుమల శేషాచల అడవి ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలకు స్వర్గధామంగా మారింది. భక్తుల ముసుగులో వస్తూ అడవిలోకి

శేషాచలం.. ఎర్ర దొంగలకు స్వర్గధామం
భక్తుల ముసుగులో  చొరబాటు
ఫారెస్ట్ అధికారుల దృష్టి మళ్లించేందుకు
అడవికి నిప్పు ఆగంతకుల చేష్టలకు గౌతమి వనం బుగ్గి

 
తిరుమల :   తిరుమల శేషాచల అడవి ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలకు స్వర్గధామంగా మారింది. భక్తుల ముసుగులో వస్తూ అడవిలోకి చొరబడుతున్నారు. ఫారెస్ట్ అధికారుల దృష్టి మళ్లించేందు కు అడవికి నిప్పుపెడుతూ దుండగులు తమ లక్ష్యాన్ని సాధించుకుంటున్నారు.  
 చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచల అడవులకు ఆనుకుని ఉన్న గ్రామాల నుంచి వెళ్లే మార్గాలపై అటవీశాఖాధికారులతోపాటు టాస్క్‌ఫోర్సు సిబ్బంది ఎక్కువ నిఘా పెట్టారు. దీంతో స్మగ్లరు, కూలీలు తిరుమలను కేంద్రంగా ఎంచుకున్నారు. తమిళనాడులోని తిరుమన్నామలై, సేలం, కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి స్మగ్లర్లు, కూలీలుగా వచ్చే వారే ఎక్కువ గా ఉన్నారు. ఎవరికి అనుమానం రా కుండా భక్తుల అవతారం ఎత్తుతారు. పెరిగిన జుట్టు, మాసిన గడ్డం, లగేజీలతో భక్తుల రూపంలో తిరుమలకు చేరుతున్నారు. ఇక్కడ ఉచిత వసతి సముదాయాల్లో తలదాచుకుంటారు. ఉచిత నిత్యాన్న భోజన సముదాయంలో ఆకలి తీర్చుకుంటారు. రోజుల తరబడి తిష్టవేస్తారు.

 అదను చూసి అడవిలోకి చొరబాటు
 తిరుమలకు చేరుకున్న తర్వాత అడవిలోకి మకాం మారుస్తారు. ఆలయానికి ఉత్తర దిశలోని గోగర్భం డ్యాం మీదుగా కాకులకొండ, పారువేట మం డపం, పాపవినాశనం మార్గాల నుంచి మామండూరు వరకు ప్రయాణం సాగిస్తారు. మరికొందరు శిలాతోరణం, ధర్మగిరి వేద పాఠశాల, శ్రీవారి పాదాల మీదుగా రంగంపేట, భాకరాపేట, ఎర్రవారిపాళెం, తలకోన వరకు అడవి సందపను తలించేందుకు వెళతారు. మరికొందరు అలిపిరి మార్గం నుంచి గాలిగోపురం మీదుగా నడచి వస్తూ మార్గ మధ్యలో అవ్వాచ్చారి కోన లోయ నుంచి శేషతీర్థం, సీతమ్మతీర్థం మార్గాల్లోని ఎర్రచందనం కలపను సేకరిస్తారు. అక్కడి నుంచి మామండూరు, బాలపల్లి నుంచి కలపను తరలిస్తారు. శ్రీవారి మెట్టు నడకదారి నుంచి అడవిలోకి వచ్చి ఛామాలారేంజ్‌లోని కలప నరికి తరలిస్తున్నారు.

 ఫారెస్ట్ అధికారుల దృష్టి మళ్లించేందుకు అడవికి నిప్పు
 చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల పరిధిలో సుమారు 5.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో శ్రీవేంకటేశ్వర అభయారణ్యం ఉంది. ఈ ప్రాంతంలో విలువైన ఎర్రచంద నం, శ్రీగంధం వృక్ష సంపద ఎక్కువగా ఉంది. ఈ సంపదను కొల్లగొట్టేందుకు దుండగులు బృందాలుగా ఏర్పడి అడవులను విభజించుకుంటారు. ప్రాంతా ల వారీగా ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేస్తున్నారు. ఇందుకోసం స్మగ్లర్లు, కూలీలు అడవికి నిప్పు పెడుతుంటారు. ఒక చోట భారీ స్థాయి లో నిప్పు పెట్టి అటవీశాఖాధికారులు, సిబ్బందిని దృష్టి మళ్లిస్తారు. మరో మార్గంలో ముందుగానే సిద్ధం చేసుకుని దాచిపెట్టిన కలపను ఎల్లలు దాటి స్తూ సొమ్ము చేసుకుంటారు. సోమవారం పాప వినాశనం మార్గంలోని గౌతమి వనంలో జరిగిన అగ్ని ప్రమా దం ఇలాంటిదేనని అటవీశాఖాధికారులు స్పష్టం చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement