తమిళ కూలీలు పరారీ: ఎర్రచందనం స్వాధీనం | Red sandalwood seized in YSR district | Sakshi
Sakshi News home page

తమిళ కూలీలు పరారీ: ఎర్రచందనం స్వాధీనం

Jan 30 2016 9:40 AM | Updated on Sep 3 2017 4:38 PM

వైఎస్ఆర్ జిల్లా రాయచోటి మండలం అనుంపల్లి అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు.

కడప : వైఎస్ఆర్ జిల్లా రాయచోటి మండలం అనుంపల్లి అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలోని తమిళకూలీలు... అటవీశాఖ అధికారులపై రాళ్ల దాడి చేశారు. దీంతో సదరు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.

దీంతో తమిళ కూలీలు పరారైయ్యారు. అనంతరం అటవీ ప్రాంతంలో పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 20 ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు.  తమిళ కూలీల కోసం వారు తనిఖీలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement