పోలీసుల కూంబింగ్ : ఎర్రచందనం కూలీలు పరారీ | red sandalwood seized in mangalam forest in chittoor district | Sakshi
Sakshi News home page

పోలీసుల కూంబింగ్ : ఎర్రచందనం కూలీలు పరారీ

Jul 5 2016 11:29 AM | Updated on Sep 4 2017 4:11 AM

చిత్తూరు జిల్లా తిరుపతి నగర శివారులోని మంగళం అటవీ ప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం కూంబింగ్ నిర్వహించారు.

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి నగర శివారులోని మంగళం అటవీ ప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని గమనించిన ఎర్రచందనం కూలీలు అక్కడి నుంచి పరారైయ్యారు. అక్కడ ఉన్న వాహనం నుంచి 14 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వాహనాన్ని సీజ్ చేశారు. పరారీలో ఉన్న ఎర్రచందనం కూలీల కోసం గాలింపు చర్యలను టాస్క్ఫోర్స్ పోలీసులు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement