
నవరత్న పథకాల కరపత్రాలు అందజేస్తున్న సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి
నల్లమాడ: వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం అయ్యేలా ఆశీర్వదించాలని వైఎస్సార్సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ప్రజలను కోరారు. అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగిరేలా చూడాలన్నారు. మండల కేంద్రం నల్లమాడలోని 148,149వ బూత్ల్లోని పాత మసీదు వీధి, మేదర కొట్టాలు, అక్కమ్మగారి వీధి, బెస్త బజార్, పోలీస్స్టేషన్ వెనుక వీధి తదితర ప్రాంతాల్లో గురువారం సమన్వయకర్త ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ నల్లమాడ, రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాలు నిర్వహించారు.
సమన్వయకర్త శ్రీధర్రెడ్డి ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల కరపత్రాలు అందజేసి పథకాల గురించి వివరించారు. జగనన్న సీఎం కాగానే రైతులకు ప్రతిఏటా మే నెలలోనే రూ.12,500 పెట్టుబడి సాయం అందించడమే గాక ఉచితంగా బోర్లు వేయిస్తారన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్, లేదా రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీచేసి సున్నా వడ్డీకే అక్కచెల్లెమ్మలకు రుణాలు మంజూరు చేస్తామని, డ్వాక్రా రుణాలు చెల్లించవద్దని మహిళలకు సూచించారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంక్ ఖాతాలో యేడాదికి రూ.15 వేలు జమచేస్తామని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తామన్నారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని తెలిపారు.
సమస్యల ఏకరువు..
రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమంలో సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డికి ప్రజలు పలు సమస్యలను ఏకరువు పెట్టారు. తాగునీరు సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అక్కమ్మగారి వీధికి చెందిన మహిళలు డేరంగుల గంగులమ్మ, హాజీనా వాపోయారు. సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి తక్షణమే స్పందించి తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ రాబర్ట్విల్సన్కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. వేలిముద్రలు పడలేదంటూ పింఛన్ తొలగించారని వృద్ధురాలు నారాయణమ్మ కన్నీరుమున్నీరైంది. డ్వాక్రా రుణం మాఫీ కాలేదని, పింఛన్, పక్కాగృహాలు, సబ్సీడీ రుణాలు, డ్రైనేజీ తదితర సమస్యలను ఏకరువు పెట్టారు. మరో ఐదు నెలలు ఓపిక పట్టాలని, జగనన్న సీఎం కాగానే అందరి సమస్యలు తీరతాయని శ్రీధర్రెడ్డి హామీ ఇచ్చారు.
మండల కన్వీనర్ పొరకల రామాంజనేయులు, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్హెచ్ బాషా, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొరకల రమణ, జిల్లా కార్యవర్గ సభ్యురాలు మోదీనమ్మ, మాజీ సర్పంచ్లు టీడీ కేశవరెడ్డి, రంగలాల్నాయక్, మంజునాథరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.రమణానాయక్, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు కుళ్లాయినాయక్, మండల అధ్యక్షుడు డి.రమణానాయక్, హిందూపురం పార్లమెంట్ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, నాయకులు జయరామిరెడ్డి, దుద్దుకుంట వెంకటరెడ్డి, ఆర్పీ రెడ్డి, జి.కేశవరెడ్డి, కె.వేణుగోపాల్, షబ్బీర్, సలీం, గోవిందరెడ్డి, పెద్దరెడ్డెప్ప, శివశంకర్రెడ్డి, శివారెడ్డి, చంద్రహాసరెడ్డి, యూత్ నాయకులు సతీష్యాదవ్, ప్రతాప్నాయక్, శంకర్రెడ్డి, పాల నరసింహులు, తిరుపాల్రెడ్డి, సోమశేఖర్రెడ్డి, ప్రకాష్, కె.గంగాధర, జింకల ఆదినారాయణ, నారాయణస్వామి, బత్తల వెంకటనారాయణ, వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.