పెన్నహోబిలం ఆలయంలో ప్రొటోకాల్ వివాదం | protocal issue in anantapur district | Sakshi
Sakshi News home page

పెన్నహోబిలం ఆలయంలో ప్రొటోకాల్ వివాదం

May 9 2015 7:10 PM | Updated on May 29 2018 2:28 PM

అనంతపురం జిల్లా పెన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో ప్రొటోకాల్ వివాదం తలెత్తింది.

అనంతపురం: అనంతపురం జిల్లా పెన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. శనివారం అక్కడ రథోత్సవం జరిగింది. స్థానిక ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి రాకుండానే ఆలయ అధికారులు రథోత్సవాన్ని ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆలయ అధికారి సుధారాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు టీడీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement