రేపటి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ నిలిపివేస్తాం | Private travel buses will not run since tomorrow, says Parakala Prabhakar | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ నిలిపివేస్తాం

Aug 31 2013 1:20 PM | Updated on Sep 1 2017 10:19 PM

రేపటి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ నిలిపివేస్తాం

రేపటి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ నిలిపివేస్తాం

రేపటి నుంచి సీమాంధ్రలో ప్ర్రైవేట్ ట్రావెల్ బస్సు సర్వీసులను నిలిపి వేస్తున్నట్లు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా రేపటి నుంచి సీమాంధ్రలో ప్ర్రైవేట్ ట్రావెల్ బస్సు సర్వీసులను నిలిపి వేస్తున్నట్లు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ శనివారం విశాఖపట్నంలో వెల్లడించారు. సమైక్యాంధ్ర ఉద్యమం పాలపొంగు కాకూడదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తేనే రాష్ట్ర విభజన సమస్యకు పరిష్కారం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంట్కు, అసెంబ్లీలకు తాళాలు వేసి తెలుగువారి వాడి ఏంటో చూపించాలని సీమాంధ్ర ప్రజలకు, నాయకులుకు పరకాల ప్రభాకర్ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement