
1న రాష్ట్రపతి తిరుమలకు?
భారత రాష్ట్రపతిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రామ్నాథ్ కోవింద్ సెప్టెంబరు 1న కుటుంబ సభ్యులతో కలసి తిరుమల రానున్నట్లు సమాచారం.
అదేవిధంగా తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులకు ప్రాథమిక సమాచారం అందింది. అధికారిక ఉత్తర్వులు ఇంకా అందలేదని వారు తెలిపారు.