పవర్ కెనాల్కు గండి:విద్యుత్కు అంతరాయం
సాక్షి, అమరావతి: సీలేరు ఏజెన్సీలో భారీ వర్షాలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డొంకరాయి, దిగువ సీలేరు మధ్య విద్యుత్ కెనాల్కు గండి పడటంతో ఇబ్బందులు తలెత్తినట్లు విద్యుత్ శాఖ పేర్కొంది. భారీ వర్షాలు కారణంగా జెన్కో నిర్వహిస్తున్న మరమ్మతులకు ఆటంకం ఏర్పడింది. 300 నుంచి 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పతికి అంతరాయం కలిగింది. వీలైనంత త్వరగా విద్యుత్ కెనాల్ మరమ్మతులు పూర్తి చేస్తామని జెన్ కో తెలిపింది.