breaking news
Disrupted
-
హైదరాబాద్లో మెట్రో సేవలకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మెట్రో రైలు సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. ఎల్బీ నగర్-అమీర్పేట్ మధ్య మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. మియాపూర్- ఎల్బీ నగర్ మెట్రో రైలులో సాంకేతిక సమస్య ఏర్పడింది. వెంటనే సిబ్బంది స్పందించి.. సమస్యను పరిష్కరించారు. అసెంబ్లీ స్టేజీ దగ్గర అరగంట పాటు రైలును నిలిపివేయగా, గాంధీ భవన్ స్టేజీ దగ్గర మరో 10 నిమిషాలు నిలిపివేశారు. అనంతరం యథావిధిగా మెట్రో సేవలు కొనసాగాయి. గతంలోనూ మెట్రో రైలు సర్వీసులకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. అంతరాయాలు ఎక్కువగా ఉదయం, రాత్రి ఆఫీసుల నుంచి రాకపోకలు సాగించే సమయాల్లో ఏర్పడుతుండడంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. -
‘డబుల్’ బాటకు బ్రేక్..
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: బీజేపీ ‘చలో బాటసింగారం’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డిని, ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు, ఇతర నేతలను అరెస్టు చేసి వారు బాటసింగారం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గసభ్యుడు ఏపీ జితేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఇతర నాయకులను వారి వారి నివాసాల్లోనే నిర్బంధంలో ఉంచారు. కాన్వాయ్కి డీసీఎం అడ్డుగా పెట్టి.. హైదరాబాద్ శివార్లలోని బాటసింగారంలో మధ్య లో నిలిపేసిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం పరిశీలించాలని కిషన్రెడ్డి నిర్ణయించారు. అక్కడే పేదల ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వివరాలను వెల్లడించాలని భావించారు. దీంతో బుధవారం రాత్రి నుంచే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వివిధ స్థాయిల పార్టీ నాయకులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే వారిని, ఆఫీసు బాధ్యులను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇతర నాయకులను కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో ఉదయాన్నే ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన కిషన్రెడ్డి నేరుగా బాటసింగారం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన ఎయిర్పోర్టు నుంచి బయటకు రాగానే అనుమతి లేకుండా ఆందోళన కార్యక్రమాలు చేపట్టొద్దని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించారు. బీఆర్ఎస్ నేతలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ధర్నాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా రఘునందన్రావు ప్రశ్నించారు. అంతా కలిసి ఔటర్ రింగ్రోడ్డు మీదుగా బాట సింగారం వైపు బయలుదేరారు. అయితే పోలీసులు ఓర్ఆర్ఆర్ వద్దే కాన్వాయ్కి ఎదురుగా డీసీఎంను నిలిపి అడ్డుకున్నారు. నా చర్మం ఊడిపోతోంది.. మీపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తా పోలీసుల వైఖరికి నిరసనగా కిషన్రెడ్డి, ఇతర నేతలు రోడ్డుపై వర్షంలో తడుస్తూనే బైఠాయించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని, పోలీసులకు సహకరించాలని పోలీసు కమిషనర్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో తనను రోడ్డు పైనుంచి లేపేందుకు ప్రయతి్నంచిన పోలీసులతో కేంద్రమంత్రి వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? మీ చర్యలతో నా చర్మమంతా ఎరుపుగా మారి కమిలిపోయి ఊడి పోతోంది. మిమ్మల్ని లోక్సభ స్పీకర్ ముందు నిలబెడతా.. మీపై ఫిర్యాదు చేస్తా.. మీరు సీఎం కేసీఆర్ కుటుంబానికి కట్టుబానిసల్లా పనిచేస్తున్నారు. నన్ను చంపుతారా?..చంపండి..ఇంటికి మాత్రం వెళ్లను..’ అంటూ కిషన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రిని బలవంతంగా ఆయన వాహనంలో కూర్చోబెట్టి పోలీసులే నడుపుతూ ఆరాంఘర్, పీవీ ఎక్స్ప్రెస్ వే, మాసబ్ ట్యాంక్, ఎర్రమంజిల్, ఖైరతాబాద్ మీదుగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు. కాగా కిషన్రెడ్డి, ఇతర నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ పార్టీ కార్యాలయం సమీపంలో బీజేపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టి»ొమ్మను దహనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచి్చంది. పార్టీ పరంగా డబుల్ బెడ్ రూం ఇళ్లపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యం: ఈటల బీజేపీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అబ్దుల్లాపూర్మెట్, బాటసింగారం పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు వైపు ఏ ఒక్కరినీ అనుమతించలేదు. ఎంపీ అరవింద్ను బంజారాహిల్స్లోని నివాసంలో, డీకే అరుణను జూబ్లీహిల్స్లోని నివాసంలో హౌస్ అరెస్టు చేశారు. ఈటలను శామీర్పేటలోని ఇంటి వద్దే అడ్డుకోగా, ఆయన కార్యకర్తలతో కలిసి అక్కడే ధర్నాకు కూర్చొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కేంద్రమంత్రి హక్కులను భంగం కలిగించే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి అప్పులు తీసుకుని, రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులతో నిర్మించిన డబుల్ ఇళ్లను పేదలకు ఇంకా ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యం అని అన్నారు. తార్నాకలో రాంచందర్రావు, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డిలను గృహ నిర్బంధంలో ఉంచారు. -
కూకట్పల్లి ప్రాంతానికి ఈ నెల 29న నీళ్లు బంద్..
సాక్షి, హైదరాబాద్: మంజీరా ఫేజ్– 2 పైపులైన్లకు మరమ్మతుల కారణంగా ఈ నెల 29న(శుక్రవారం) పలు ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. కలగ్గూర్ నుంచి పటాన్చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ పైప్లైన్కు వివిధ ప్రాంతాల్లో లీకేజీల నివారణకు మరమ్మతులు చేపడుతున్నామని.. కంది గ్రామం వద్ద పైప్లైన్ జంక్షన్ పనులు చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు నీటిసరఫరా నిలిచిపోనుంది. చదవండి: ఆంత్రాక్స్ వ్యాధి కలకలం: మటన్ కొంటున్నారా..? జర జాగ్రత్త! అంతరాయం ఏర్పడే ప్రాంతాలివీ డివిజన్ నం.9: హైదర్నగర్, రాంనరేష్నగర్, కేపీహెచ్బీ, భాగ్యనగర్, వసంత్ నగర్, ఎస్పీనగర్ తదితర ప్రాంతాలు. డివిజన్ నం.15: మియాపూర్, దీప్తి శ్రీనగర్, మాతృశ్రీనగర్, లక్ష్మీనగర్, జేపీ నగర్, చందానగర్ తదితర ప్రాంతాలు. డివిజన్ నం. 23: నిజాంపేట్, బాచుపల్లి, మల్లంపేట, ప్రగతినగర్. డివిజన్ నం. 32: బొల్లారం తదితర ప్రాంతాలున్నాయి. చదవండి: లీటర్ పెట్రోల్ రూ.112... భారీగా చార్జీలు పెంచేసిన జొమాటో, స్విగ్గీ, క్యాబ్స్! -
పవర్ కెనాల్కు గండి:విద్యుత్కు అంతరాయం
సాక్షి, అమరావతి: సీలేరు ఏజెన్సీలో భారీ వర్షాలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డొంకరాయి, దిగువ సీలేరు మధ్య విద్యుత్ కెనాల్కు గండి పడటంతో ఇబ్బందులు తలెత్తినట్లు విద్యుత్ శాఖ పేర్కొంది. భారీ వర్షాలు కారణంగా జెన్కో నిర్వహిస్తున్న మరమ్మతులకు ఆటంకం ఏర్పడింది. 300 నుంచి 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పతికి అంతరాయం కలిగింది. వీలైనంత త్వరగా విద్యుత్ కెనాల్ మరమ్మతులు పూర్తి చేస్తామని జెన్ కో తెలిపింది. -
ఆకివీడు జన్మభూమి కార్యక్రమంలో రసాభాస
-
ఆర్చరీ కోచ్ చెరుకూరి దీక్ష భగ్నం
-
వేతనం వదులుకోనున్న ఎన్డీయే ఎంపీలు
న్యూఢిల్లీ: నిరసనలు, ఆందోళనల కారణంగా పార్లమెంటు బడ్జెట్ మలిదశ సమావేశాలు సజావుగా సాగకపోవటంతో.. ఈ 23 రోజుల వేతనాన్ని వదులుకునేందుకు అధికార ఎన్డీయే ఎంపీలు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ బుధవారం వెల్లడించారు. కాంగ్రెస్, ఇతర విపక్షాల అప్రజాస్వామిక తీరు కారణంగానే పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడుతున్నాయని విమర్శించారు. ప్రజలు చెల్లిస్తున్న పన్ను వృధా అవుతోందన్నారు. ‘ఈ విషయాన్ని ప్రధాని, బీజేపీ అధ్యక్షుడు, ఎన్డీయే పక్షాల అధ్యక్షులతో చర్చించాం. రెండోవిడత బడ్జెట్ సమావేశాలు జరిగిన 23 రోజుల వేతనాన్ని వదులుకోవాలని నిర్ణయించాం’ అని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాసం సహా పలు అంశాలపై చర్చకు సిద్ధమని ప్రకటించినా విపక్షాలు ఆందోళన చేయటం సరికాదని అనంత్ కుమార్ పేర్కొన్నారు. -
ఏకాగ్రతకు 10 మెట్లు
అర్జునుడు వీరత్వం వల్ల వీరుడు కాలేదు.కాన్సన్ట్రేషన్ వల్ల అయ్యాడు. పక్షి కన్ను మీద దృష్టి నిలపగలగడం వల్లే అతడు వీరుడుగా నిలబడగలిగాడు. ఏ మనిషికైనా ప్రథమ ఆయుధం ఏకాగ్రతే.అది వెంట ఉంటే మిగిలిన శక్తులన్నీ తోడు నిలుస్తాయి. లక్ష్య సాధన సులువవుతుంది. గమ్యం దరి చేరుతుంది.కాని ఆ ఏకాగ్రతకు భంగం వాటిల్లుతుంటే? దృష్టి ఒక అంశం మీద నుంచి మరో అంశం మీదకు వెంటవెంటనే మరులుతూ ఉంటే? సమస్య ఉన్నట్టే.ఏకాగ్రతను పెంచడానికి వ్యాయామాలూ, చిట్కాలు ఉన్నాయా?ఈ వ్యాయామాలు అందరికోసమే అయినా... ప్రత్యేకంగా ఇప్పుడు పరీక్షల సీజన్ కాబట్టి చదివే సమయంలో ఏకాగ్రత కలగడానికి ఏం చేయాలి? ఇక్కడ కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. అనుసరించండి... ప్రయోజనం పొందండి. మీరు జిమ్లో చేరగానే పెద్ద బరువులెత్తుదామని ఉబలాటపడతారు. కానీ ఎత్తలేక ఇబ్బంది పడతారు. దాంతో తక్కువ బరువులతో మొదలుపెట్టి క్రమంగా శక్తిని పుంజుకుంటూ... ఒక దశ తర్వాత పెద్ద పెద్ద బరువులనూ చులాగ్గా, చురుగ్గా ఎత్తగలుగుతారు. ఏకాగ్రత విషయంలో కూడా ఇదే సూత్రం. మన మైండ్ కూడా ఒక మజిలే అని భావించి సాధన చేస్తే ఇది సాధ్యమే. థెరాన్ క్యూ డ్యుమాంట్ అనే రచయిత ‘ద పవర్ ఆఫ్ కాన్సంట్రేషన్’ పుస్తకంలోని మెదడు తన ఏకాగ్రత శక్తినిపెంచుకోవడానికి కొన్ని వ్యాయామాలు సూచించాడు.వీటిలో కొన్ని హాస్యాస్పదంగా అనిపించినా, వాటిని అనుసరించిన వారికి తగిన ఫలితాలు కనిపించాయని చాలా మంది తేల్చిచెప్పారు. ఆ చిట్కాలూ, వ్యాయామ సూచనలు ఇలా ఉన్నాయి. కుర్చీలో కదలకుండా కూర్చోండి అభ్యాసం–1 ఒక కుర్చీలో సౌకర్యంగా కదలకుండా కూర్చోండి. మొదట మీకిది చాలా సులభం అనిపిస్తుంది. కానీ కష్టం. కొద్దిసేపు కూర్చున్న తర్వాత బోర్గా అనిపిస్తుంది. అటు ఇటు కదలాలని, లేవాలని అనిపిస్తుంది. ఏ కదలికలూ లేకుండా కనీసం 15 నిమిషాల పాటు అలా కదలకుండా కూర్చోండి. అంతసేపు మీరు ఎలాంటి కదలికలూ లేకుండా కూర్చోగలిగారంటే ఆ తర్వాత ఎంత సేపైనా కూర్చోవచ్చని మీకు తెలుస్తుంది. అలా కూర్చొని ఎంతసేపైనా చదవుకోగలమనే నమ్మకం (కాన్ఫిడెన్స్) కలగడానికి మొదటి మెట్టు ఈ సాధన. నీళ్లు నిండిన గ్లాసుపై దృష్టి నిలపండి అభ్యాసం–2 ఒక గ్లాసులో నిండుగా నీళ్లు నింపండి. ఆ గ్లాసును వేళ్లతో పట్టుకొని మీ చేయి చాచి, దాన్నే చూస్తూ ఉండండి. నీళ్లు ఏమాత్రం బయటకు తొణకకుండా ఎంతసేపు ఉంచగలరో చూడండి. కొందరికి మొదట నిమిషంలోనే తొణకవచ్చు. ఇదే వ్యాయామాన్ని కొనసాగిస్తూ మీ వ్యవధిని ఒక నిమిషం నుంచి 5 నిమిషాలకు పెంచండి. మొదట ఒక చేత్తో చేశాక, తర్వాత మరో చేతితోనూ దీన్ని చేయండి. మీకు తెలియకుండానే కదలిపోయే కండరాలపై నియంత్రణకు ఈ వ్యాయామం దోహదపడుతుంది. ప్రతి కండరపు కదలికా మీ నియంత్రణలోకి వచ్చేందుకు దోహదం చేస్తుందీ వ్యాయామం. వాసన చూసే శక్తిని పెంచుకోండి అభ్యాసం–3 మీరు తోటలో నడుస్తున్నప్పుడు రకరకాల పూల వాసనలు తెలుస్తుండవచ్చు. కాని ఏది ఏ పువ్వు వాసన అని నిర్దిష్టంగా పసిగట్టేలా సాధన చేయండి. వాసనలను బట్టి అక్కడ ఉన్న పూవులేమిటి, మీరు మిస్ అయినవేమిటి అని చూసుకుంటూ సాధన చేస్తే... మీ ఏకాగ్రత పెరిగినట్టే భావించవచ్చు. ఇలా సూక్ష్మంగా వాసనలను పసిగట్టే సామర్థ్యం పెంపొందితే... ఒకనాడు ఎప్పుడో పీల్చిన నైట్క్వీన్ వాసనకూ, మల్లె వాసనలను పసిగట్టగలగడమే కాదు... అంతగా తెలియని వారికి అవి వేర్వేరు అని వివరించవచ్చు కూడా. రిలాక్స్డ్గాగుండె చప్పుడు వినండి అభ్యాసం–4 మొదట మంచం మీద రిలాక్స్డ్గా పడుకోవాలి. ప్రతి కండరమూ వదులుగా రిలాక్స్డ్గా ఉండేలా చూడాలి. అప్పుడు మన గుండె స్పందన మీద దృష్టి సారించాలి. మీలోని గుండె అంత చిన్నగా ఉన్నప్పటికీ, ఆ గొప్ప అవయవం మీ ఒంటి మొత్తానికీ అనుక్షణం, ప్రతిక్షణం ఎలా రక్తసరఫరా చేస్తుందో ఊహించుకోండి. ఒక చివరన ఉన్న మీ కాలి బొటనవేలు మొదలు మీ తల వరకు అన్ని అవయవాలకూ అనునిత్యం రక్తం అందుతున్న తీరును ఊహిస్తూ, ఆ అనుభూతిని ఆస్వాదించండి. ఈ అనుభూతితో కలిగే భావోద్వేగం... మిమ్మల్ని చాలా రిలాక్స్ చేయడంతో పాటు మీరు హాయిగా, సంతోషంగా ఉన్న ఫీలింగ్ కలగజేస్తుంది. మీరు సంతోషంగానూ, ఆరోగ్యకరంగానూ ఉన్నారన్న ఫీలింగ్ కారణంగా ఎలాంటి అంశంపైనైనా తదేకంగా, ఏకాగ్రతతో దృష్టికేంద్రీకరించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని పొందడం సాధ్యమవుతుంది. నిద్రపై దృష్టి కేంద్రీకరించండి అభ్యాసం–5 దీన్ని ‘వాటర్ మెథడ్’ అని కూడా అంటారు. ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ ఇది చాలా ప్రభావపూర్వకమైనది. మీరు నిద్రించే గదిలోని ఒక బల్ల మీద ఒక గ్లాసు నిండా నీళ్లు నింపి ఉంచండి. ఒక కుర్చీని ఆ బల్ల దగ్గర వేసి, దానిలో మీరు రిలాక్స్డ్గా కూర్చొండి. అలా కూర్చున్న తర్వాత, నిలకడగా, స్పష్టంగా ఉన్న ఆ నీటిని తదేకంగా చూస్తూ... ఇలా ఆలోచించండి. ‘అబ్బ... ఆ నీళ్లు ఎంత స్పష్టంగా, పారదర్శకంగా, నిర్మలంగా ఉన్నాయి. నా మదిలోని ఆలోచనలు కూడా నెమ్మదించాలి. అవి అలా క్రమంగా నెమ్మదిస్తూ పోయి, నా హృదయం కూడా ఆ నీళ్లంతటి ప్రశాంతంగా మారాలి’ అంటూ మీకు మీరు చెప్పుకుంటూ పోండి. మీ నాడీకణాల్లో చెలరేగుతున్న ఆలోచనలను నెమ్మదించుకుంటూ పోతున్న అనుభూతి పొందుతూ అలా నిద్రలోకి జారుకుంటున్నట్లుగా భావించాలి. అలా మత్తుగా సోలిపోతున్నట్లుగా అనుభూతి చెందుతూ క్రమంగా బెడ్ మీదికి చేరి నిద్రలోకి జారిపోవాలి. ఈ అభ్యాసాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూపోతే... ఒకనాటికి నిద్రలేమి రోగులు కూడా ప్రశాంతంగా నిద్రపోతూ తమ నిద్రలేమి (ఇన్సామ్నియా) వ్యాధిని అధిగమించగలరు. అద్దం ముందు మాట్లాడండి అభ్యాసం–6 మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ ఉండండి. మీ ప్రతిబింబంలో మీ కళ్లు కనిపించే చోట మరో రెండు కళ్ల బొమ్మలు గీయండి. ఆ రెండు కళ్లూ మిమ్మల్నే చూస్తున్నట్లుగా భావించండి. నిటారుగా కూర్చొని మీరు కూడా తదేకంగా ఆ కళ్లనే చూస్తుండండి. ఎదురుగా ఆ కళ్లు కలిగిన వేరే వ్యక్తి అక్కడెవరో ఉన్నట్లుగా భావిస్తూ... మీలో మెదలుతున్న ఆలోచనలపై దృష్టి కేంద్రీకరించండి. ఆ కళ్లు కలిగి ఉన్న వ్యక్తి మీకు చాలా నమ్మకమైన వ్యక్తిగా భావించండి. మీలో కలుగుతున్న పూర్తి అసంబద్ధమైన ఆలోచనలను సైతం నిస్సంకోచంగా ఆ కళ్లు కలిగి ఉన్న ఊహావ్యక్తితో పంచుకుంటున్నట్లుగా మాట్లాడుతూ ఉండండి. నెమ్మదిగా గాలిని ఊపిరితిత్తుల్లోకి లోతుగా పీల్చుకుంటూ ఉండండి. ఆ ఊహావ్యక్తితో అలా ఒక వాదనాసరళిలో మాట్లాడుతూ పోతే... అసంబద్ధమైన అంశాలే క్రమంగా సక్రమంగా మారిపోతాయి. ఒక సందిగ్ధపూరితమైన వేవరింగ్ కండిషన్ నుంచి మీకు స్పష్టత వచ్చేలా ఏకాగ్రత వైపునకు మీ ఆలోచనలు ప్రవహిస్తుంటాయి. మీరు ఈ అభ్యాసాన్ని కనీసం 3 నుంచి 5 నిమిషాలు చేసినా చాలు... మీరిలా సాధించిన ఆ ఏకాగ్రతతో క్రమబద్ధంగా లేని ఆ ఆలోచనలే సక్రమంగా మారుతాయి. మీకు మేలు చేకూర్చే మంచి ఆలోచనలుగా అవి ఆవిర్భవిస్తాయి. ఒకే ముక్కురంధ్రంతో శ్వాసించండి అభ్యాసం–7 ఒక కుర్చీలో ప్రశాంతంగా, నిటారుగా కూర్చొండి. మీ వేలితో ఒక ముక్కు రంధ్రాన్ని మూసేయండి. మరో ముక్కు రంధ్రంతో నెమ్మదిగా, గాఢంగా గాలిని లోపలికి పీలుస్తూ పోండి. ఊపిరితిత్తుల నిండా గాలి నిండాక ఒకే క్రమంలో 10 అంకెలు లెక్కబెట్టండి. అప్పుడు మెల్లగా గాలిని వదలండి. ఇలా మొదట కుడిముక్కు రంధ్రాన్ని మూసి ప్రాక్టీస్ చేశాక... తర్వాత ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి అదే ప్రక్రియను ప్రాక్టీస్ చేయండి. ఇలా రోజూ 20 సార్లు చేయండి. మీ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడంతో పాటు, మీలో మంచి ఆక్సిజన్ చేరి, ఏకాగ్రతతో పాటు దృష్టికేంద్రీకరణ శక్తి పెరుగుతుంది. అనవసరపుఆలోచనలపై దృష్టి నిలపకండి అభ్యాసం 8 ముఖ్యమైన సమయంలో అనవసరమైన ఆలోచనలు దృష్టిని కేంద్రీకరించకుండా అడ్డుపడుతుంటాయి. అందుకే దేనిపై దృష్టి నిలపాలి అనే విషయాన్ని పదే పదే ఆలోచిస్తుండాలి. అప్రాధాన్యమైన అంశానికి... అసలు పని పూర్తయ్యాక ప్రాధాన్యం ఇవ్వవచ్చంటూ మనకు మనం సజెషన్ ఇచ్చుకోవాలి. మొదట ప్రాధాన్యాంశం మీదే మన దృష్టి ఉండేలా ప్రాక్టీస్ చేయాలి. మన ప్రాధాన్యాంశాన్ని మనం పూర్తి చేయగానే మనకు జరగబోయే మేలు, మనకు లభించబోయే అభినందనలూ, మనం పొందే ఆనందాలను పదే పదే గుర్తు చేసుకోవాలి. దాంతో మీ అప్రాధాన్య ఆలోచనలు, మీకు అప్పటికి అప్రస్తుతమైన కోరికలు మనసు నుండి తొలగిపోతాయి. ఇలా క్రమంగా మీ మనసుపై అదుపు సాధించవచ్చు. ఇది సాధించిన వారికి... ఆ తర్వాత ఎలాంటి లక్ష్యాన్ని అయినా సాధించడం పెద్ద లెక్క కాదు. స్పష్టత తెచ్చుకోండి అభ్యాసం–9 చదివే సమయంలో... మనం చదివే అంశాన్ని అర్థం చేసుకోకపోతే ఎంత చదివినా ప్రయోజనం ఉండదు. అందుకే చదివే సమయంలో అది మనకు ఎంత అర్థమైంది అన్న అంశాన్ని తెలుసుకోవడం కోసం ఒక అభ్యాసం చేయవచ్చు. మొదట ఒక విషయాన్ని పూర్తిగా చదవండి. ఆ తర్వాత మీరు చదివిన టెక్స్›్టలో మీకు అర్థమైనదాన్ని సంక్షిప్తంగా రాయండి. ఇలా రాసే క్రమంలో మీకు ఏకాగ్రత కుదరడమే కాకుండా... మీరు చదివి అర్థం చేసుకున్న విషయంలో మరింత స్పష్టత వస్తుంది. ఈ అభ్యాసం చేసే సమయంలో మీరు చదివిన అంశాలు కొన్నింటిని తొలుత మీరు మరచిపోయి ఉండవచ్చు. కానీ మీరు రాస్తున్న క్రమంలో అవి గుర్తుకువస్తూ ఉంటాయి. అలా మీకు గుర్తుకు వస్తూ ఉన్నయంటేనే... మీకు ఏకాగ్రత పెరుగుతోందని అర్థం. దృష్టి కేంద్రీకరణను గమనించండి అభ్యాసం–10 మీరు ప్రశాంతంగా కూర్చొని మీ గోడగడియారం లేదా చేతి గడియారంలోని సెకండ్ల ముల్లును చూస్తూ ఉండండి. ఒక ఐదు నిమిషాల పాటు మరే అంశంపైకీ దృష్టి పోకుండా కేవలం సెకండ్ల ముల్లునే గమనిస్తూ ఉంటానని మీకు మీరే చెప్పుకోండి. ఒక్కోసారి అకస్మాత్తుగా మీ దృష్టి సెకండ్ల ముల్లు నుంచి పక్కకు తొలగిపోవచ్చు. కానీ మళ్లీ దాన్ని తిరిగి సెకండ్ల ముల్లు మీదికి తెండి. ఇది మొదట చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ పోనుపోనూ మీకు ధ్యానం లాంటి స్థితిపైకి దృష్టి మళ్లించడం ఎలాగో తెలుస్తుంది. ఇలా మీరు అనవసరమైన ఆలోచనల్లోకి జారిపోకుండా ఉండటం ఎలాగో ప్రాక్టిస్ చేస్తే... తొందరలోనే మీకు పూర్తిగా ధ్యానం మీదే దృష్టి కేంద్రీకరించి, ఆ ధ్యానంలో నిమగ్నం కావడం ఎలాగో తెలుస్తుంది. అలా ఆ అభ్యాసాన్ని కొనసాగించుకుంటూ పోతే... ఎలాంటి ఆలోచనలూ లేకుండా మనసును పూర్తిగా ప్రశాంత పరచుకోవడం ఎలాగో తెలుస్తుంది. అప్పుడా ప్రశాంత చిత్తంతో ధ్యానం సాధ్యపడుతుంది. ఈ అభ్యాసం ముగించాక... మనం నిజంగా ఏదైనా అంశంపై దృష్టి కేంద్రీకరిస్తే... దానిపై పూర్తిగా నిమగ్నం అయ్యే శక్తి మనకు సమకూరుతుంది. -
రాష్ట్రపతికి కోపం తెప్పించిన ఎంపీలు
-
రాజ్యసభను కుదిపేసిన నేషనల్ హెరాల్డ్
-
నత్తనడకన తిరుమల ఘాట్ రోడ్ల పనులు
-
రైళ్ల రాకపోకలకు అంతరాయం
నెల్లూరు: కృష్ణపట్నం నుంచి మాచర్లకు జాతీయ రహదారిపై బొగ్గులోడుతో వెళ్తున్న లారీ మనుబోలు మండలంలోని కొమ్మలపుడి- వెంకటాచలం గ్రామాల మధ్యలో ఉన్న వంతెన గోడను ఢీ కొట్టింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో గోడ కూలీ కింద ఉన్న రైల్వే పట్టాలపై పడింది. ఈ క్రమంలోనే రైల్వే విద్యుత్ లైన్లు కూడా తెగిపోయాయి. దీంతో యశ్వంత్పూర్, కేరళ వెళ్లే సూపర్పాస్ట్ రైళ్లతో పాటు పలు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించారు. దీంతో ఒక వైపు రైళ్ల రాకపోకలకు లైన్ క్లియరైంది. రెండో వైపు లైన్లో పనులు కొనసాగుతున్నాయి. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.