గిరిజన గ్రామాలకు విద్యుత్ వెలుగులు అందించాలన్న ఉద్దేశంతో నెడ్కాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలార్ లైట్లు మొరాయిస్తున్నాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు కాస్తంత వెలుగుతున్నా ఆ తర్వాత పూర్తిగా పనిచేయకపోవడంతో ఏజెన్సీ గ్రామాలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. సోలార్ దీపాలు సక్రమంగా వెలగకపోవడం ఏనుగులు ప్రభావిత గ్రామాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏ వైపు నుంచి ఏనుగులు వస్తాయో తెలుసుకునే పరిస్థితి లేకబిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
ఏనుగుల ప్రభావిత గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా ఉండడానికి సోలార్ లైట్లు ఎంతగానో దోహదపడతాయి. వెలుగును చూస్తే ఏనుగులు గ్రామాల్లోకి వచ్చే పరిస్థితి ఉండదు. ఏనుగుల ప్రభావిత గ్రామాలైన బిల్లుమడ, గుమ్మడ, కురసింగి, మీనకోట, బర్న, పెద్దపల్లంకి, కుంబి, దోనుబాయి, పెదరామ తదితర గ్రామాల్లో లైట్లు సరిగ్గా వెలగడం లేదని గిరిజనులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి 12 గంటలు దాటితే పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇటీవల ఏనుగులు గ్రామాల్లోకి చొరబడ్డాయని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లైట్లు సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. ఈ విషయమై నెడ్క్యాప్ జిల్లా మేనేజర్ రాజు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా లైట్ల మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సీతంపేట: ఏజెన్సీలో సౌర విద్యుత్ కాంతులను అందించి గిరిజన గ్రామాలకు వెలుగులనివ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సోలార్ లైట్లు మొరాయిస్తున్నాయి. మారుమూల ఎత్తయిన కొండల ప్రాంతాల్లోని గ్రామాలు, వీధి దీపాలు లేని ప్రాంతాలు, లైట్లు ఉన్నా తరచూ విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది పడుతున్న గ్రామాలను దృష్టిలో పెట్టుకుని నెడ్క్యాప్ ఆధ్వర్యంలో ఐఏపీ నిధులతో సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు. ముందుగా చేసిన సర్వే ప్రకారం ఐటీడీఏ పరిధిలోని సీతంపేట, పాలకొండ, బూర్జ, ఎల్.ఎన్.పేట, కొత్తూరు, నందిగాం, టెక్కలి, మెళియాపుట్టి, భామిని, సారవకోట, పాతపట్నం, హిరమండలం, సారవకోట, సరుబుజ్జిలి, వీరఘట్టం, సోంపేట మండలాల్లోని గిరిజన గ్రామాలు, పాఠశాలలు, ప్రభుత్వ స్థలాల్లో సుమారు 400 సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. గ్రామానికి ఒకటి నుంచి ఆరు వరకు లైట్లు వేశారు. ప్రస్తుతం ఆ లైట్లలో చాలావరకు పనిచేయడం లేదు. దీంతో గ్రామాల్లో అంధకారం నెలకొంటోంది.
ఇబ్బందులు పడుతున్నాం..
సోలార్ లైట్లు సరిగా పనిచేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అసలు ఎక్కడా వెలగని పరిస్థితి ఉంది. ఏడాదిగా మొరాయిస్తునే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు మరమ్మతులు చేయించాలి.
-ఎస్.ముఖలింగం, ఇప్పగూడ
ఫిర్యాదు చేసినా..
ఏనుగుల ప్రభావిత గ్రామాల్లో భయంగా గడపాల్సి వస్తోంది. లైట్ల విషయమై గతంలో చాలా సా ర్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఏనుగులు ఎప్పుడు గ్రామాల్లోకి ప్రవేశిస్తాయోననే భయాంగా ఉంది.
- బి.ఆదినారాయణ, చిన్నబగ్గ
అర్దరాత్రయితే ...అంధకారమే
Published Sun, May 15 2016 12:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement