అసెంబ్లీ మీడియా పాయింట్ | Political Leaders comments on Bifurcation bill over Assembly Media Point | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ మీడియా పాయింట్

Jan 31 2014 2:52 AM | Updated on Aug 18 2018 4:13 PM

‘‘ సీఎం, స్పీకర్‌లు చేసింది పనికిమాలిన చర్య. సొంతపార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దోపిడీ దొంగల్లా వ్యవహరించారు. స్పీకర్‌కు తెలంగాణవాదులు బుద్ధి చెప్తారు. ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ ఏర్పడుతుంది’’

‘‘ సీఎం, స్పీకర్‌లు చేసింది పనికిమాలిన చర్య. సొంతపార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దోపిడీ దొంగల్లా వ్యవహరించారు. స్పీకర్‌కు తెలంగాణవాదులు బుద్ధి చెప్తారు. ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ  ఏర్పడుతుంది’’
 - కేటీఆర్ (టీఆర్ ఎస్)
 ‘‘మూడు ప్రాంతాలకు న్యాయం చేసే నిర్ణయాన్ని వెలువరించేలా కాంగ్రెస్, బీజేపీలు కృషి చేయాలి. తెలంగాణ ఏర్పాటుకు సమగ్ర పరిష్కారాన్ని మా పార్టీ చూపింది. సవరణలతో కూడిన బిల్లుతో సీమాంధ్రకు న్యాయం చేయాలి.’’    - జ యప్రకాశ్ నారాయణ్ (లోక్‌సత్తా)
 ‘‘తెలంగాణ బిల్లును ఓడించి పంపించాం. నేటి పరిణామాలు చరిత్రలో నిలిచిపోతాయి’’    - పయ్యావుల కేశవ్ (టీడీపీ)
 ‘‘తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం ఖాయం. సీఎం కిరణ్ పిరికిపందలా సభలో లేకుండా పారిపోయారు.’’
 - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరేపల్లి మోహన్
 ‘‘తెలంగాణ ప్రజల కల నెరవేరబోతోంది. బిల్లు రాష్ట్రపతికి వెళ్లడం సంతోషం. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో పార్లమెంటులో ఆమోదం పొందుతుంది. సభలో స్పీకర్ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించారు.’’
     - ఈటెల రాజేందర్ (టీఆర్‌ఎస్)
 ‘‘స్పీకర్ నాదెండ్ల మనోహర్ తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నారు.  చరిత్రహీనుడిగా మిగిలిపోయారు. ఆంధ్ర నాయకులంతా ప్రజాస్వామ్య ద్రోహులుగా మిగిలారు. నైతిక విజయం మాదే.’’
 - ఎర్రబెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సీతక్క (టీడీపీ)
 ‘‘సీమాంధ్ర నాయకుల సంబరాలు చూస్తుంటే వారికి పిచ్చి ముదిరిందని స్పష్టంగా అర్థమవుతుంది. స్పీకర్, సీఎం కిరణ్ ఇద్దరూ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించారు.  బిల్లు పార్లమెంటులో నెగ్గడం ఖాయం.’’
     - గుండా మల్లేష్, కూనంనేని సాంబశివరావు (సీపీఐ)
 ‘‘సభలో స్పీకర్ తీరు రాజ్యాంగ విరుద్ధం. బిల్లును తిరస్కరించే హక్కు సభకు లేదు. ఓటింగ్, తీర్మానాలు చేసే అధికారంలేదు. పార్లమెంటులో బిల్లును బీజేపీ నెగ్గిస్తుంది.’’
 - నాగం జనార్దన్‌రెడ్డి, యెండెల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి (బీజేపీ)
 ‘‘బిల్లు విషయంలో అసెంబ్లీ వెల్లడించేది అభిప్రాయాలు మాత్రమే. అంతిమ నిర్ణయం పార్లమెంట్‌దే’’    - జూలకంటి రంగారెడ్డి (సీపీఎం)
 ‘‘ఆఖరి బంతికి 5 రన్స్ చేయాల్సి ఉండగా.. సీఎం కిరణ్ సిక్స్ కొట్టారు.  స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజారంజకం’’    - ఆనం వివేకానందరెడ్డి (కాంగ్రెస్)

Advertisement
 
Advertisement
Advertisement