రూ.కోటి విలువైన ఎర్ర చందనం డంప్ స్వాదీనం | police seize smuggled red sandalwood dump in YSR district | Sakshi
Sakshi News home page

రూ.కోటి విలువైన ఎర్ర చందనం డంప్ స్వాదీనం

Nov 13 2014 9:04 AM | Updated on Oct 22 2018 1:59 PM

వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలం కుక్కలదొడ్డి అటవీ ప్రాంతంలో పోలీసుల తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్ర చందనం దుంగలు బయటపడ్డాయి.

కడప : వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలం కుక్కలదొడ్డి అటవీ ప్రాంతంలో పోలీసుల తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్ర చందనం దుంగలు బయటపడ్డాయి. సుమారు రూ.కోటి విలువ చేసే ఎర్రచందనం డంప్ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న స్మగ్లర్ల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.

మరోవైపు బ్రహ్మంగారి మఠం మండలం వట్టిమడుగు అటవీ ప్రాంతంలో నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 48 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.  రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement