- పోలీసుల ‘దారి’ దోపిడీ
- వాహనచోదకుల నుంచి
- భారీగా గుంజుడు
ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రారంభించకపోయినా.. గోదావరిపై నాలుగో వంతెనపై రాకపోకలకు ప్రజలు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. అటు రోడ్ కమ్ రైలు వంతెనను మరమ్మతులకోసం మూసివేయడం.. రావులపాలెం, ధవళేశ్వరం బ్యారేజి మీదుగా రాజమండ్రి చేరుకోవడం దూరం కావడంతో.. లారీలు, కార్లు, ఇతర వాహనాలు నాలుగో వంతెన పైనుంచే అనధికారికంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇదే అదునుగా పోలీసు శాఖలోని వసూల్ రాజాలు చెలరేగిపోతున్నారు. వాహనానికింత అని రేటు నిర్ణయించి అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు. డ్యూటీతో సంబంధం లేకుండా వంతెనపై యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు.
రాజమండ్రి :గోదావరి నాలుగో వంతెనపై పోలీసుల వసూళ్లదందా పట్టపగ్గాల్లేకుండా సాగుతోంది. అనధికారికంగా వంతెనపై రాకపోకలు సాగిస్తున్న వాహనచోదకులను అడ్డుకుని భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. లారీలు, ద్విచక్ర వాహన చోదకుల నుంచి ప్రతి రోజూ వేలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారు. రాజమండ్రి - కొవ్వూరు మధ్య ఉన్న రోడ్డు కమ్ రైలు వంతెనపై మరమ్మతుల కోసం ఈ నెల 2 నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు.
వంతెన పనులు 45 రోజులపాటు జరిగే అవకాశమున్నందున వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. దీంతో వాహనదారులు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీనిపై కేవలం ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు బస్సులను మాత్రమే అనుమతించారు. దీంతో రావులపాలెం మీదుగా లారీలు ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల కనీసం 90 కిలోమీటర్లు చుట్టుతిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఇదే సమయంలో రాజమండ్రి - కొవ్వూరు మధ్య దాదాపు నిర్మాణం పూర్తవుతున్న నాలుగో వంతెనపై నుంచి వాహనచోదకులు రాకపోకలు ఆరంభించారు. ఈ వంతెనను ప్రభుత్వం ఇంతవరకూ ప్రారంభించలేదు.
అయినప్పటికీ దాదాపు నిర్మాణం పూర్తి కావస్తున్న ఈ వంతెన పైనుంచి లారీలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. దీనివల్ల వారికి సమయంతోపాటు ఇంధనం ఆదా అవుతోంది. ముఖ్యంగా రావులపాలెం మీదుగాకంటే నాలుగో వంతెన మీద రాకపోకలు చేసేవారికి విశాఖ - విజయవాడ మధ్య సుమారు 45 కిలోమీటర్ల దూరం కలిసివస్తోంది. దీంతో వారు కూడా ఈ వంతెన పైనుంచే రాకపోకలు సాగిస్తున్నారు. రాజమండ్రి - కొవ్వూరు మధ్య వాహనదారులకు ధవళేశ్వరం బ్యారేజికంటే ఈ వంతెన మీదుగానే రాకపోకలు సులువవుతోంది. కాతేరువద్ద అప్రోచ్ రోడ్డు నుంచి కిందకు దిగి అక్కడ నుంచి నేరుగా రాజమండ్రి నగరంలోకి వస్తున్నారు. దీంతో వందలమంది ద్విచక్ర వాహనదారులు ఈ వంతెనమీదుగా రాకపోలు సాగిస్తున్నారు.
అనధికారికంగా సాగుతున్న ఈ రాకపోకలే పోలీసులకు కాసుల పంట పండిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో సంబంధం లేకుండా ఎవరు పడితే వారు రోడ్డుమీద స్వతంత్రంగా బీటు వేసి అక్రమంగా డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక్కడ దందా సాగిస్తున్న పోలీసులు లారీకి రూ.300 నుంచి రూ.500 వరకు, కార్లు, ఇతర చిన్నవాహనదారుల నుంచి రూ.200, ద్విచక్ర వాహనదారుల నుంచి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు.
రాజమండ్రి, రాజానగరం, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు స్టేషన్లకు చెందిన పోలీసులు వంతుల వారీగా ఎవరికి వారు డ్యూటీలు వేసుకున్నట్టుగా వసూళ్ల దందాకు పాల్పడుతుండడంతో వాహనచోదకులు బెంబేలెత్తుతున్నారు. వెను తిరిగే వీలు లేకుండా వంతెన మొదట్లో కాపు కాయడంతో అడిగినంతా పోలీసుల చేతిలో పెట్టాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో అయితే పోలీసుల దోపిడీకి పట్టాపగ్గాల్లేకుండా పోతోంది.
నైట్బీట్ వేస్తే నగరంలో గస్తీ తిరగడం మాని ‘చలో నాలుగో వంతెన’ అంటూ పోలీసులు తరలిపోవడం వెనుక ఈ దందాయే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకసారి ఇక్కడ బీటు వేస్తే చాలు రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ అయాచితంగా వచ్చి పడుతోంది. దీంతో ఇక్కడ అనధికార డ్యూటీ చేసేందుకు పోలీసులు ఎగబడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దారిదోపిడీని నిలువరించాలని వాహనచోదకులు కోరుతున్నారు.
వంతెనపై వసూల్ రాజాలు
Published Sat, Apr 18 2015 4:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement