శ్రీవారి ఆశీస్సులు అందుకునేందుకు వచ్చా | Pawan Kalyan Visits Tirumala Temple | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆశీస్సులు అందుకునేందుకు వచ్చా

May 14 2018 1:46 AM | Updated on Mar 22 2019 5:33 PM

Pawan Kalyan Visits Tirumala Temple - Sakshi

సాక్షి, తిరుమల: శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, ఆశీస్సులు అందుకునేందుకు తిరుమల వచ్చానని, సంతోషంగా ఉందని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అలిపిరి నుంచి శనివారం కాలినడకన తిరుమల వచ్చిన ఆయన ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమల ఆలయంలోని యోగనృసింహస్వామి సన్నిధి వద్ద తనకు అన్నప్రాసన చేసి, పేరు పెట్టారన్నారు. తిరుమల పుణ్యక్షేత్రంలో దైవ సంబంధిత విషయాలు తప్ప వేరేవి మాట్లాడకూడదన్నారు. అంతకుముందు సుమారు 64 మందితో కలసి ఆయన వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ మార్గం నుంచి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత కూడా పవన్‌ తిరుమలలోని హంపి మఠంలోనే బస చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement