
సాక్షి, తిరుమల: శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, ఆశీస్సులు అందుకునేందుకు తిరుమల వచ్చానని, సంతోషంగా ఉందని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. అలిపిరి నుంచి శనివారం కాలినడకన తిరుమల వచ్చిన ఆయన ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమల ఆలయంలోని యోగనృసింహస్వామి సన్నిధి వద్ద తనకు అన్నప్రాసన చేసి, పేరు పెట్టారన్నారు. తిరుమల పుణ్యక్షేత్రంలో దైవ సంబంధిత విషయాలు తప్ప వేరేవి మాట్లాడకూడదన్నారు. అంతకుముందు సుమారు 64 మందితో కలసి ఆయన వైకుంఠం క్యూకాంప్లెక్స్ మార్గం నుంచి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత కూడా పవన్ తిరుమలలోని హంపి మఠంలోనే బస చేశారు.