మా కుమారుడి ఆచూకీ తెలపండి

Parents Request to Police on Son Missing Case YSR Kadapa - Sakshi

దంపతుల వేడుకోలు

వైఎస్‌ఆర్‌ జిల్లా,జమ్మలమడుగు రూరల్‌:  ఈనెల 16న తమ కుమారుడు కులాయి స్వామిని తెలంగాణ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని ఇంత వరకు మా కుమారుడి ఆచూకీ తెలుపలేదని మైలవరం మండలం చిన్నవెంతుర్ల గ్రామానికి చెందిన రాజన్న, పుష్పావతి దంపతులు ఆవేదన చెందారు. ఈ మేరకు వారు సోమవారం జాతీయ ఎస్సీ కమిషన్, మానవహక్కుల కమిషన్‌తోపాటు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు మెయిల్‌ ద్వాలా పిటిషన్‌ పంపించారు. హైదరాబాద్‌లోని మాదాపురం పోలీసులు తమ కుమారుడిని అదుపులోకి తీసుకుని 9 రోజులు దాటినప్పటికీ తమకు గాని, తలమంచిపట్నం పోలీసులకు గాని ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. తాము కేవలం దళితులమని.. దిక్కులేని వారమనే  తెలంగాణ పోలీసులు ఇలా చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నరని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top